News June 7, 2024

ఎన్డీఏ కూటమి సమావేశానికి శ్రీకాకుళం, విజయనగరం ఎంపీలు

image

ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుతో కలిసి ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఫోటో దిగారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం పార్లమెంటు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.

Similar News

News December 22, 2025

శ్రీకాకుళం: పోలియో సిరా చుక్క..ఎందుకంటే?

image

శ్రీకాకుళం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం 93% పూర్తయినట్లు వైద్యాధికారులు నేడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 0-5 ఏళ్లున్న చిన్నారులకు రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేసినంతరం ఎడమచేతి చిటికెల వేలుకు చుక్క పెడతారు. దీనికి కారణమేంటంటే..మరొక కేంద్రానికి వెళ్లకుండా, పోలియో చుక్కలు దుర్వినియోగం కాకుండా ఈ విధానం కొనసాగిస్తున్నారు. గతంలో సిరా పెట్టేవారు. ప్రస్తుతం పర్మినెంట్ మార్కర్ పెన్ వాడుతున్నారు.

News December 22, 2025

శ్రీకాకుళం జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ దందా

image

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ అండతో కొందరు మాఫియాగా మారి ఇసుక అక్రమ దందా సాగిస్తున్నారు. శివారు గ్రామాలను డంపింగ్ కేంద్రాలుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో భారీ లారీలతో ఒడిశా, హైదరాబాద్‌లకు రవాణా చేస్తున్నట్లు ఊహగానాలున్నాయి. దీంతో నదీ పరీవాహక భూములు కోతకు గురవుతున్నాయి. అధికారికంగా 27 ర్యాంపుల్లో 4.50లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలగా, అనధికారకంగా లక్షల క్యూబిక్ మీటర్లు తరలిందని సమాచారం.

News December 22, 2025

శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను ఫిర్యాదుల రూపంలో నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.