News September 19, 2024
ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో కడప జిల్లా నుంచి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందరోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పనితీరుపై చర్చించారు.
Similar News
News January 9, 2026
కడప జిల్లాలో 81,345 విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు

కడప జిల్లాలో 81,345 విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. కడప డివిజన్లో 23,250, మైదుకూరులో 14,305, ప్రొద్దుటూరులో 30,304, పులివెందులలో 13,486 సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగాన్ని పారదర్శకంగా చూపిస్తాయని ఎస్ఈ రమణ తెలిపారు. బిల్లులు ఆటోమేటిక్గా రూపొందుతాయన్నారు. విద్యుత్ పొదుపు, ఖర్చు తగ్గింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
News January 9, 2026
YVU: బీఈడీ, ఎంఈడీ పరీక్షా ఫలితాలు విడుదల

YVU బీఈడీ, ఎంఈడీ పరీక్షా ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ శుక్రవారం విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ.. సెప్టెంబరులో పరీక్షలు జరిగాయన్నారు. ఫలితాలు సకాలంలో విడుదల చేశామన్నారు. విద్యార్థులు ఫలితాల కోసం వైవీయూ వెబ్సైట్ https://www.yvuexams.in/results.aspx ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. పద్మ, సీఈ ప్రొ. కృష్ణారావు పాల్గొన్నారు.
News January 9, 2026
20 సూత్రాల సమావేశానికి ప్రొద్దుటూరు MLA ఒక్కరే.!

కడపలోని 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్ అధ్యక్షతన శుక్రవారం కడపలో అభివృద్ధి సమావేశం జరిగింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కీలకమైన ఈ సమావేశానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఒక్కరే హాజరయ్యారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై ఆయన సమావేశంలో లేవనెత్తారు. వైసీపీ, జనసేనకు MLAలు ఉన్నా, వారెవ్వరూ సమావేశానికి హాజరుకాలేదు.


