News April 11, 2025

ఎన్నికలకు సమాయత్తం కావాలి: ఎన్నికల కమిషనర్

image

ఏడాదిలో జరగనున్న పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం ముందస్తుగా సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్నారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో ఆమె ఎన్నికల నిర్వహణపై తెలంగాణ కమిషనర్ రాణి కుమిదినితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సజావుగా జరిగేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

రెండో విడత ఎన్నికలు.. నేడు గుర్తులు కేటాయింపు.!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు ఈరోజు గుర్తులు కేటాయించనున్నారు. అటు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇప్పటికే రెబల్స్ బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేయించే పనిలో నిమగమయ్యారు. కాగా గుర్తుల కేటాయింపు అనంతరం ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది.

News December 6, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} నేడు ఖమ్మం, మధిర, చింతకాని మండలాల్లో పవర్ కట్
∆} నేడు ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ
∆} నేడు ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News December 6, 2025

సత్తుపల్లి: అక్రమ వేట.. మాజీ MLA సోదరుడి కుమారుడి అరెస్టు

image

సత్తుపల్లిలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ వేట కార్యకలాపాలపై టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించి నలుగురిని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు రఘు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం పట్టుబడిన రఘు, మరో నిందితుడు కుంజా భరత్‌లను కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు ఉంటాయని DFO హెచ్చరించారు.