News April 11, 2025
ఎన్నికలకు సమాయత్తం కావాలి: ఎన్నికల కమిషనర్

ఏడాదిలో జరగనున్న పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం ముందస్తుగా సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్నారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో ఆమె ఎన్నికల నిర్వహణపై తెలంగాణ కమిషనర్ రాణి కుమిదినితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సజావుగా జరిగేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
21న ఓటీటీలోకి ‘బైసన్’

* చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు.
* హాలీవుడ్లో సంచలనాలు సృష్టించిన F1 మూవీ DEC 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బ్రాడ్ పిట్ లీడ్ రోల్ పోషించారు.
News November 17, 2025
జగిత్యాల: శీతాకాలం.. జిల్లావాసులకు SP సూచనలు

శీతాకాలం మొదలైనందున రహదారులపై పొగమంచు ఎక్కువగా ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
1. వేగం తగ్గించాలి
2. ఫాగ్లైట్లు- లో బీమ్ ఉపయోగించాలి
3. ముందున్న వాహనానికి దూరం పాటించాలి
4. ఓవర్టేక్ చేయరాదు
5. రోడ్డుపై వాహనాలు నిలపకూడదు
6. హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని SP కోరారు.
News November 17, 2025
సినిమావాళ్ల కంటే మిరే నష్టపోతున్నారు: రాజమౌళి

పోలీసులకు సవాల్ చేసి.. భస్మాసుర హస్తంలా ఇమ్మడి రవి తన తల మీద తానే చెయ్యి పెట్టుకున్నాడని, ఏదీ ఊరికే రాదని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఐ బొమ్మలో ఫ్రీగా మూవీలు ఎలా వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించారా? మీ పర్సనల్ డేటా ఇమ్మడి రవి అమ్ముకుంటున్నాడు. అంత పెద్ద సర్వర్లు మెయింటెన్ చేయాలంటే ఎంతో డబ్బు కావాలి. ఆ డబ్బంతా మీరే ఇస్తున్నారు. మా సినిమా వాళ్లకంటే.. మీరే ఎక్కువగా నష్టపోతున్నారన్నారు.


