News April 11, 2025

ఎన్నికలకు సమాయత్తం కావాలి: ఎన్నికల కమిషనర్

image

ఏడాదిలో జరగనున్న పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం ముందస్తుగా సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్నారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో ఆమె ఎన్నికల నిర్వహణపై తెలంగాణ కమిషనర్ రాణి కుమిదినితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సజావుగా జరిగేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.

Similar News

News November 12, 2025

ఖమ్మం: మొంథా తుఫాన్.. ఎకరానికి రూ.10 వేలు పరిహారం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొంథా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ నివేదించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని తాను కోరినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు చొప్పున పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

News November 12, 2025

కామారెడ్డి: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మండలాల ప్రగతిపై ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై ఎంపీడీవోల పర్యవేక్షణ ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, జడ్పీ సీఈవో చందర్ నాయక్, డీఆర్డీఓ సురేందర్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

News November 12, 2025

జగిత్యాల: ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం దిగుమతులు: కలెక్టర్

image

రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం నాచుపెల్లి JNTU కళాశాలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కొడిమ్యాల, మల్యాల మండలాల రైస్ మిల్లర్లు, రైతులతో ధాన్యం కొనుగోళ్లపై ఆయన సమీక్షించారు. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులకు సూచించారు.