News February 4, 2025

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: దంతాలపల్లి MPDO

image

దంతాలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వివేక్ రామ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీఓ అప్సర్ పాషా, సెక్రటరీలు మోడెం మధు, సృజన, నాగరబోయిన శ్రీధర్, సతీష్, అజయ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 26, 2025

బాపట్ల: గమనిక.. రేపు పీజీఆర్ఎస్ రద్దు

image

ప్రతి సోమవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి 29వ తారీకు వరకు మొంథా తుఫాను ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది కావున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఎవరు సమస్యలకు సంబంధించిన అర్జీలతో జిల్లా కార్యాలయానికి సోమవారం రావద్దని తెలిపారు.

News October 26, 2025

సూర్యలంక బీచ్ వద్ద బారికేడ్లు

image

బాపట్ల మండలం సూర్యలంక బీచ్ వద్ద ఆదివారం పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బీచ్ ఎంట్రన్స్ వద్ద పర్యాటకులు రాకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. బీచ్ సందర్శన కోసం వస్తున్న పర్యాటకులను వెనక్కి పంపించేశారు. పర్యాటకుల సందర్శన తాత్కాలికంగా నిషేధించినట్లు సిఐ చెప్పారు.

News October 26, 2025

ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి – మంత్రి అనగాని

image

మొంథా తుఫాన్‌ దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు .రెవెన్యూ, పోలీస్, NDRF బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. 27, 28, 29 తేదీలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ తీరందాటే వరకు సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.