News February 24, 2025

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

ఈ నెల 27న నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆల్ పార్టీస్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఆమెతో పాటు ఎస్పీ జానకి షర్మిల, పలువురు నాయకులు ఉన్నారు.

Similar News

News February 25, 2025

మేడ్చల్: టీచర్లకు కలెక్టర్ కీలక సూచనలు..

image

పదవ తరగతి తరువాత ఏ దిశగా వెళ్లాలనే అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా మార్గనిర్దేశం చేసి వారి భవిష్యత్తుకు చేయూతనందించేలా అన్ని పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. సోమవారం కూకట్‌పల్లి మండలం ఎల్లమ్మబండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయనతో పాటు సంబంధిత అధికారులు ఉన్నారు.

News February 25, 2025

రావణ, మయూరి వాహనంపై దర్శనమిచ్చిన కైలాసనాధుడు

image

శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల్లో సందర్బంగా 4వ రోజు సోమవారం రాత్రి శ్రీకాళహస్తీశ్వరుడి రావణ, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు మయూరి వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టణ పురవీధుల్లో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు.

News February 25, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ 48 గంటలపాటు నిశ్శబ్ద వ్యవధి అమలు: జిల్లా కలెక్టర్ ✓ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి: AIKMS ✓ కల్తీ పెట్రోల్ బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ✓ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి: ఐటీడీఏ పీఓ ✓ దమ్మపేటలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ✓ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు ✓ జూలూరుపాడులో చెరువుల కబ్జాపై సర్వే ✓ ఆళ్లపల్లి రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురికి గాయాలు

error: Content is protected !!