News February 24, 2025

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

ఈ నెల 27న నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆల్ పార్టీస్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఆమెతో పాటు ఎస్పీ జానకి షర్మిల, పలువురు నాయకులు ఉన్నారు.

Similar News

News November 25, 2025

కృష్ణా: అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాల పోస్టుల భర్తీకి సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలో మొత్తం 17 అంగన్వాడీ కార్యకర్త, 82 సహాయకురాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ICDS PD రాణి తెలిపారు. అర్హులైన వారు డిసెంబర్ 3వ తేదీలోపు సంబంధిత CDPO ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21-35సం.ల మధ్య వయసు కలిగి పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని తెలిపారు.

News November 25, 2025

నేడు హనుమకొండలో బీజేపీ రైతు దీక్ష

image

రైతుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఏకశిల పార్క్‌లో మహా రైతు దీక్ష చేపట్టానున్నారు. ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు.

News November 25, 2025

జగన్నాథపురంలో శాటిలైట్ రైల్వే స్టేషన్?

image

విశాఖ రైల్వే స్టేషన్‌ మీద ట్రాఫిక్‌ భారం తగ్గించేందుకు రైల్వే శాఖ సబ్బవరం సమీపంలోని జగన్నాథపురం వద్ద కొత్త శాటిలైట్ స్టేషన్‌ను ప్రతిపాదించినట్లు సమాచారం. కొత్తవలస–అనకాపల్లి మధ్య 35 కిమీ బైపాస్ లైన్ ప్రాజెక్టులో భాగంగా.. 563 హెక్టార్లు విస్తీర్ణంలో రూ.2,886.74 కోట్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టేషన్‌లో 15 ఫ్రైట్ ఎగ్జామినేషన్ లైన్లు, 5 కోచింగ్, 11 స్టాబ్లింగ్ లైన్లు ఉండనున్నట్లు సమాచారం.