News April 10, 2025
ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: గ్యానేష్ కుమార్

ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత దేశంలోని మీడియా నోడల్ అధికారులు,సోషల్ మీడియా నోడల్ అధికారులు,జిల్లా పౌర సంబంధాల అధికారులపై ఉందని భారత ఎన్నికల ప్రధాన అధికారి గ్యానేష్ కుమార్ సూచించారు. న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రసి అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ శిక్షణ కేంద్రంలో బుధవారం నోడల్, ఈ సోషల్ మీడియా నోడల్ అధికారి, డిపిఆర్ఓలకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు.
Similar News
News March 9, 2026
కొత్త బురుజులో సీఎం చంద్రబాబు ప్రజా సభ

డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. తొలుత రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దనరెడ్డి, ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
News March 9, 2026
విశాఖ భీమిలి బీచ్ రోడ్లో విరాగో రిసార్ట్ సీజ్..!

భీమిలి బీచ్ రోడ్డులో విరాగో రిసార్ట్ను సోమవారం అధికారులు సీజ్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులతో అధికారులు రిసార్ట్ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
News March 9, 2026
ఆ తేదీల్లో రికమండేషన్ లెటర్లు అంగీకరించం: TTD

AP: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా ఈ నెల 17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD తెలిపింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొంది. అయితే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.


