News March 27, 2025

ఎన్నికలలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా గురువారం ఎంపీపీ, ఉప సర్పంచ్ స్థానాలకు జరిగే ఎన్నికలలో ఎవరైనా అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.

Similar News

News December 10, 2025

ఉచిత ఇసుక పారదర్శకతకు కృషి: కలెక్టర్

image

ఉచిత ఇసుకను పారదర్శకంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 4రీచ్‌లలో సెమీ మెకనైజ్డ్ పద్ధతి ద్వారా ఇసుక తీసేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఈ రీచ్‌లలో మర్లపాలెం, కపిలేశ్వరం, జొన్నాడ, ఆలమూరు రీచ్‌లు ఉన్నాయని కలెక్టర్ వివరించారు.

News December 10, 2025

సూర్యాపేట: BRS కార్యకర్త హత్య.. హరీశ్‌రావు ఫైర్

image

పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో BRS కార్యకర్త ఉప్పుల మల్లయ్య హత్య ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ అప్రజాస్వామిక, అరాచక పాలనకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం బాధాకరమన్నారు.

News December 10, 2025

కామారెడ్డి: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

image

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉదయ్ కిరణ్, అబ్దుల్ సమీర్ వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ఇన్‌ఛార్జి పీడీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కళాశాల నుంచి జాతీయస్థాయికి విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.