News March 27, 2025
ఎన్నికలలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ

పల్నాడు జిల్లా వ్యాప్తంగా గురువారం ఎంపీపీ, ఉప సర్పంచ్ స్థానాలకు జరిగే ఎన్నికలలో ఎవరైనా అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
Similar News
News November 24, 2025
ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోండి: AC

TTD శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ శాఖ విజయనగరం జిల్లా AC శిరీష ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ స్థలం ఆధారంగా మందిరాలను టైప్ A, B, Cలుగా విభజించి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్థల వివరాలు, యజమాని NOCను జతచేసి, దరఖాస్తులను తోటపాలెంలో ఉన్న దేవాదాయ శాఖ కార్యాలయానికి అందజేయాలన్నారు.
News November 24, 2025
BHPL: 61 దరఖాస్థులను స్వీకరించిన అదనపు కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్థుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీవోసీలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రజల నుంచి 61 దరఖాస్థులను ఆయన స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్థులు పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారం కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 24, 2025
రామసముద్రం యువతి బెంగళూరులో దారుణ హత్య

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన విద్యార్థిని బెంగళూరులో హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. రామసముద్రం (M) బిక్కంగారిపల్లికి చెందిన దేవిశ్రీ (21) బెంగళూరులో BBA చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థితో చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రికి చెందిన ప్రేమ్ వర్ధన్ పరిచయం పెంచుకున్నాడు. వారి మధ్య ఏం జరిగిందో తెలిదు.. నిన్న రాత్రి హత్య చేసి పరారయ్యాడు.


