News February 27, 2025
ఎన్నికలవేళ పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

రేపు జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లామీయా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల భద్రత కోసం చేపట్టాల్సిన జాగ్రత్తలపై ఏసీపీ బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి వివరించారు.
Similar News
News November 28, 2025
3,058 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

రైల్వేలో ఇంటర్ అర్హతతో 3,058 NTPC (UG) పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. దరఖాస్తుకు ఈనెల 27 ఆఖరు తేదీకాగా.. DEC 4వరకు పొడిగించారు. ఫీజు చెల్లించడానికి DEC 6వరకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తులో తప్పుల సవరణ DEC 7-16 వరకు చేసుకోవచ్చు. వయసు 18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. www.rrbcdg.gov.in/
News November 28, 2025
వరంగల్: పార్టీ జెండా, కండువాలే అస్త్రాలు

పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులుండవు. గ్రామపోరులో ఏ గుర్తు ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. పోటీచేసే అభ్యర్థి తాను ఏ పార్టీకి చెందినవాడో తెలియజేసేది చేతిలో పార్టీ జెండా, కండువాలే. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు, చీరల, రేషన్ కార్డుల పంపిణీలను తమ ప్రచార అస్త్రాలుగా చేసుకొని గ్రామాల్లో ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ వైఫల్యాలే తమకు ప్రచార అస్త్రాలని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి.
News November 28, 2025
ADB: ఏకగ్రీవాలు చెల్లవు..!

సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవ తీర్మానాల జోరు కొనసాగుతోంది. అయితే ఇవి చెల్లుబాటు కావని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఉపసంహరణ, నామినేషన్ల తిరస్కరణకు గురైన తర్వాత ఒకరే అభ్యర్థి బరిలో ఉంటే దానిని ఏకగ్రీవంగా ప్రకటిస్తామని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10, నిర్మల్ జిల్లాలో 7 వరకు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు జరిగినట్లు సమాచారం.


