News February 27, 2025

ఎన్నికలవేళ పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

image

రేపు జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లామీయా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల భద్రత కోసం చేపట్టాల్సిన జాగ్రత్తలపై ఏసీపీ బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి వివరించారు.

Similar News

News December 4, 2025

అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోండి: సీఎం

image

గ్రామాలను అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధి అడ్డుకునే వారు, పంచాయితీలు పెట్టే వారితో గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని హితవు పలికారు. ఏకగ్రీవం చేసుకునే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

News December 4, 2025

విశాఖ చేరుకున్న మంత్రి లోకేశ్

image

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు ఉత్తరాంధ్ర టీడీపీ, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రజలు, కార్యకర్తలను కలిసిన వారి వద్ద నుంచి లోకేశ్ అర్జీలు స్వీకరించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు. విశాఖ నుంచి రోడ్డుమార్గంలో పార్వతీపురం జిల్లా భామిని గ్రామానికి చేరుకుంటారు. అనంతరం టీడీపీ నాయకులుతో సమవేశం నిర్వహిస్తారు. రాత్రికి ఆదర్శ పాఠశాలలో బస చేస్తారు.

News December 4, 2025

MBNR: కంపెనీ సెక్రటరీ కోర్సులకు భారీ డిమాండ్: వీసీ

image

మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో పీయూలో కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ & ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో, ఐసీఎస్‌ఐ సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కార్పొరేట్ రంగంలో కంపెనీ సెక్రటరీ (సీఎస్‌) వంటి ప్రొఫెషనల్ కోర్సులకు భారీ స్థాయిలో డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.