News February 22, 2025
ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్ఫిడెన్స్ను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.
Similar News
News March 15, 2025
గుంటూరు ఛానల్లో గల్లంతైన బాలుడి మృతి

పెదకాకాని మండలం నంబూరులోని గుంటూరు ఛానల్లో శుక్రవారం గల్లంతైన బాలుడు మృతి చెందాడు. స్థానిక అంబేడ్కర్ నగర్కు చెందిన ప్రొక్లెయినర్ డ్రైవర్ ఏసురత్నం, సాంబమ్మ దంపతుల 2వ కుమారుడు జాషువా(12) స్థానిక జడ్పీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో గుంటూరు ఛానల్కు వెళ్లాడు. సరదాగా నీటిలో దిగుదామనే ప్రయత్నం చేస్తుండగా కాలుజారి కాలువలో పడి గల్లంతై మరణించాడు.
News March 15, 2025
మేడికొండూరు: బాలికపై 65ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి

మేడికొండూరు మండలం పేరేచర్ల ఎస్సీ కాలనీకి చెందిన 65 ఏళ్ల దేవరకొండ రామారావు అదే కాలనీలోని తన స్నేహితుడు ఇంటికి శుక్రవారం వెళ్లాడు. ఇంటిలో బాలిక మాత్రమే ఉండడంతో లైంగిక దాడికి యత్నించాడు. అతనితో పెనుగులాడిన బాలిక పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. ఇది తెలిసిన బాధితురాలి బంధువులు మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 15, 2025
తుళ్లూరు: పోలీసులతో పటిష్ట బందోబస్తు

వెంకటపాలెంలో నేడు జరగబోవు శ్రీవారి కల్యాణానికి వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. బంధువు పొత్తు నిర్వహణకు వీలుగా సభా ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్ఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.