News February 17, 2025

ఎన్నికలు: మేడ్చల్ జిల్లా అప్‌డేట్

image

మేడ్చల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 34 గ్రామ పంచాయతీల్లో 66,044 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 33,150 మంది పురుషులు ఉండగా, 32,898 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. 34 జీపీల పరిధిలో 320 వార్డులు ఉండగా, 320 పోలింగ్ కేంద్రాలను సైతం ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News December 9, 2025

చాట్ జీపీటీతో కొత్త వంగడాల సృష్టి సులభమా?

image

వాతావరణ మార్పులు, కరవు, వరదల వల్ల వ్యవసాయంలో కొత్త వంగడాల అవసరం పెరిగింది. కొత్త వంగడాల అభివృద్ధికి ప్రస్తుతం చాలా సమయం పడుతోంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా గుర్తించగలదు.

News December 9, 2025

తిరుపతి: సెమిస్టర్ వస్తున్న హాస్టల్ సీటు రాదా.!

image

TTD శ్రీపద్మావతి డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది 900 మంది చేరారు. అందరికి హాస్టల్ సీటు ఇస్తామని TTD బోర్డు సభ్యులు సైతం హామీ ఇచ్చారు. అయితే సెమిస్టర్ పరీక్షలు వస్తున్నా ఇప్పటి వరకు 350 మందికిపైగా హాస్టల్ సీటు కోసం ఎదురుచూస్తున్నారు. 2 హాస్టల్ భవనాలు ఖాళీగా ఉండగా వాటిని వెంటనే శుభ్రం చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు TTD విద్యాశాఖకు హాస్టల్ సీట్ల కోసం ఫైల్ పంపి నెల కాస్తున్న ఎలాంటి స్పందన లేదు.

News December 9, 2025

KNR: కట్టింది రెండు గోడలే.. రూ.కోట్లు కొట్టేశారు..!

image

మానేరు రివర్ ఫ్రంట్‌లో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. పనులు అవ్వకుండానే కాంట్రాక్టర్‌కు రూ.192CR బిల్లులు చెల్లించడం వివాదాస్పదమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలొస్తున్నాయి. BRS ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.545 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కాగా, ఇప్పటివరకు మానేరుకు ఇరువైపులా కేవలం 2 రిటైనింగ్ వాల్స్ మాత్రమే కట్టారు.