News February 1, 2025
ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి: సుదర్శన్ రెడ్డి

ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇతర సంబంధిత నోడల్ అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
కలెక్టరేట్లో ప్రతిష్టాపనకు సిద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యిందని, విగ్రహ ప్రతిష్టాపన పనులు చివరి దశకు చేరాయని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. కలెక్టరేట్కు మరింత ఆకర్షణ వచ్చే విధంగా విగ్రహ ఏర్పాటు ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 4, 2025
ఏపీకి జల్శక్తి మంత్రిత్వ శాఖ నోటీసులు

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్పై కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారంలోపు ప్రాజెక్టు వాస్తవ స్థితిపై సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పోలవరం-నల్లమల సాగర్ డీపీఆర్ కోసం టెండర్లు పిలవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
News December 4, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓భద్రాచలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
✓ చండ్రుగొండ అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
✓ ఎన్నికల ప్రచారానికి అనుమతి తప్పనిసరి: మణుగూరు డీఎస్పీ
✓ కొత్తగూడెం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
✓ సైబర్ మోసానికి పాల్పడితే 1930కు కాల్ చేయండి: ఇల్లందు డీఎస్పీ
✓ కరకగూడెం: ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు చోరీ
✓ భద్రాచలం: తానా వేదికపై ఆదివాసి చిన్నారి ప్రతిభ
✓ ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్


