News February 26, 2025

ఎన్నికల్లో జోనల్ అధికారులపాత్ర కీలకం: జిల్లా

image

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు, సిబ్బందిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News December 1, 2025

శ్రీపతిపల్లి: సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు

image

‘తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే’ అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత అన్నదమ్ములు ప్రధాన రాజకీయ పార్టీల సర్పంచ్ అభ్యర్థులుగా ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. చిల్పూర్(M) శ్రీపతిపల్లికి చెందిన రంగు రమేష్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, ఆయన సోదరుడు రంగు హరీష్ BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకే కుటుంబం నుంచి పోటీలో నిలవడంతో విజయం ఎవరిని వరిస్తుందోనని గ్రామంలో తీవ్ర చర్చ నడుస్తోంది.

News December 1, 2025

సీఎం పర్యటనలో లోపాలు చోటు చేసుకోవద్దు: ADB కలెక్టర్

image

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లాకు చేసే పర్యటనను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకూడదని హెచ్చరించారు. అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలన్నారు.

News December 1, 2025

నస్పూర్: ‘ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు.