News March 30, 2024
ఎన్నికల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు, పోలింగ్ రోజు అత్యవసర సేవల విధులు నిర్వహించే అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పన పై ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News February 8, 2026
ఖమ్మం: కర్మకాండలకు వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. తిరుమలాయపాలెం మండలం జల్లెపల్లికి చెందిన సుతారీ మేస్త్రి అన్నెపర్తి ఎల్లయ్య శనివారం రాత్రి బైక్పై వస్తుండగా.. జిన్నింగ్ మిల్లు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 8, 2026
‘మధిర అంటే నాకు ప్రాణం’ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘మధిర అంటే నాకు ప్రాణం..నా జన్మధన్యమయ్యేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మధిర పట్టణాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
News February 8, 2026
ఖమ్మం: ఎన్నికల నోడల్ ఆఫీసర్గా వీవీఎల్ అన్నపూర్ణ

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఎన్నికల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్గా అసిస్టెంట్ సెక్రటరీ వీవీఎల్ అన్నపూర్ణను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఏదులాపురం (32 వార్డులు), కల్లూరు (20), మధిర (22), సత్తుపల్లి (23), వైరా (20) పరిధిలో ఎన్నికల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఆమె పర్యవేక్షిస్తారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు 92475 97048 నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.


