News April 25, 2024

ఎన్నికల్లో పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవాలి: విశాఖ కలెక్టర్

image

వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా అందరూ కలిసి రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటు ప్రాముఖ్యత తెలుసుకొని, ఓటర్ చైతన్యం, హోమో ఓటింగ్ విధానం అంశాలపై ఆయన ఈరోజు ఆలిండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Similar News

News January 9, 2026

ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.

News January 9, 2026

ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.

News January 8, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుడి మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో ఓ కార్మికుడు మృతి చెందాడు. అజీమాబాద్‌కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) ప్లాంట్‌లోని ఫ్రెండ్స్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సెంటర్ ప్లాంట్ విభాగంలో పనులు ముగించుకుని కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు.