News August 6, 2024

ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేయాలి: విశాఖ కలెక్టర్

image

ఈ నెల 30న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో రెవెన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశమై మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ కోడ్) పటిష్టంగా అమలు చేయాలన్నారు. చెక్ పోస్టులను పెట్టి తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.

Similar News

News November 15, 2025

విశాఖ పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్

image

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని విజయనగరానికి చెందిన బంగారి శ్రీనివాసరావు మంత్రి లోకేశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని నెల్లూరుకు చెందిన కొప్పాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

News November 15, 2025

విశాఖ-హైదరాబాద్ రూ.18వేలు

image

విశాఖలో జరుగుతున్న CII సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలు, డెలిగేట్స్ భారీగా తరలివచ్చారు. శుక్రవారం సదస్సు ప్రారంభం కాగా.. ముందురోజే నగరానికి చేరుకున్నారు. దీంతో గురువారం నుంచి రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా మరికొన్ని విమానాలను నడిపినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. నేటితో సమ్మిట్‌ ముగియనుండడంతో హైదరాబాద్ నుంచి విశాఖకు టికెట్ రూ.4,000 – 5,000 వరకు ఉండగా.. విశాఖ-హైదరాబాద్ రూ.18వేల వరకు ఉంది.

News November 14, 2025

అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్: గంటా

image

అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాతగోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో సమస్యలు పెరిగాయని, త్వరలో నియామకం జరగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.