News February 25, 2025

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ఏర్పాట్ల పరిశీలించారు. న‌గ‌రంలోని ప‌ట‌మ‌ట బాలుర ఉన్న‌త పాఠ‌శాల‌ను త‌నిఖీ చేశారు.

Similar News

News December 24, 2025

ప.గో: రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి.. UPDATE

image

పెనుమంట్ర మండలం పొలమూరులో జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం స్పందించారు. ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన ఘటనపై పోలీసు, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ జరపాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి త్వరగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

News December 24, 2025

GNT: బస్సు నడుపుతుండగా గుండెనొప్పి.. 68 మందిని కాపాడాడు

image

పెదనందిపాడు మండలం వరగాని వద్ద ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి చూపారు. పర్చూరు నుంచి గుంటూరు వెళ్తుండగా డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి నిలిపివేశారు. దీంతో బస్సులోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను స్థానిక ఆలీ క్లినిక్‌కు, అక్కడి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

News December 24, 2025

విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

‘విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది’ అందుకే పంట అధిక దిగుబడి, ఆదాయం కోసం తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవాలి. ఆయా ప్రాంతాలకు అనువైన విత్తన రకాలను స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తీసుకోవాలి. విత్తనాలను కొనుగోలు చేసే క్రమంలో రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునేందుకు <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.