News February 25, 2025
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్ల పరిశీలించారు. నగరంలోని పటమట బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.
Similar News
News December 15, 2025
MTM: కొట్లాడుకున్నారు.. కలిసి విగ్రహాలు పెడుతున్నారు.!

మచిలీపట్నం నియోజకవర్గ కూటమిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం తమ పార్టీ ముఖ్య నేతల విగ్రహాల ప్రతిష్ఠ విషయంలో రోడ్డెక్కి రచ్చ చేసిన TDP, BJP నేతలు నేడు ఒకటైపోయారు. హౌసింగ్ బోర్డ్ రింగ్లో వాజ్ పేయి విగ్రహం పెడతామని, కాదు NTR విగ్రహం పెడతామని ఆందోళనకు దిగిన ఇరు పార్టీల వాళ్లు పార్టీ పెద్దల ఆదేశాలతో అదే సెంటర్లో ఈ నెల 16న ఇద్దరి మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు సిద్ధమయ్యారు.
News December 15, 2025
తూ.గో: కల్లు అమ్మకాలు నిలిపివేయించిన ఎమ్మెల్యే.. అసలేం జరిగిందంటే..!

ఆధ్యాత్మిక స్థలాల్లో ధార్మిక ఆచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. ఏవీఏ రోడ్డులోని జీవకారుణ్య సంఘ స్థలంలో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ చొల్లంగి ఏడుకొండలు కల్లు విక్రయాలు సాగిస్తున్నట్లు తెలియడంతో అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి వాటిని నిలిపివేయించారు. పవిత్రమైన ప్రాంతాల్లో ఇలాంటి పనులు చేయడం తగదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది హెచ్చరించారు.
News December 15, 2025
రాజమండ్రి: రేపటి నుంచి ఉర్దూ స్వర్ణోత్సవ వారోత్సవాలు

ఉర్దూ అకాడమీ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీఆర్ఓ టి.సీతారామమూర్తి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్లో ఉర్దూ అకాడమీ ప్రతినిధి నస్రీన్ ఫాతిమాతో కలిసి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందరూ వీటిని విజయవంతం చేయాలని కోరారు.


