News February 25, 2025
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్ల పరిశీలించారు. నగరంలోని పటమట బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.
Similar News
News November 21, 2025
SKLM: ‘జాబ్ కార్డులు కోసం దరఖాస్తుల స్వీకరణ’

జాబ్ కార్డుల కోసం ధరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయితీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా పంచాయతీలలో గల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కేవైసీ కారణంగా ఆలస్యమైన జాబ్ కార్డులు పరిశీలించి ఇస్తామన్నారు.
News November 21, 2025
జగిత్యాల: వృద్ధుల ఫిర్యాదులకు కౌన్సిలింగ్

వృద్ధులపై నిరాదరణ చూపుతున్న కొడుకులు, కోడళ్లకు సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులను పోషించకపోతే వయోవృద్ధుల ట్రిబ్యునల్ ద్వారా 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చని, వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నా కలెక్టర్ తిరిగి తల్లిదండ్రుల పేరిట మార్చగలరని జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరిఅశోక్ కుమార్ హెచ్చరించారు. పలువురు ఒప్పంద పత్రాలు రాసిచ్చి పెద్దలను వెంట తీసుకెళ్లారు.
News November 21, 2025
వైష్ణవ క్షేత్రాలకు విజయనగరం నుంచి ప్రత్యేక సర్వీసులు

మార్గశిర, ధనుర్మాసం పుణ్యదినాలు పురస్కరించుకుని ప్రయాణికులు సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ వారు ప్రముఖ వైష్ణవ క్షేత్రాలైన ద్వారకాతిరుమల, వాడపల్లి, అంతర్వేది, అప్పన్నపల్లి, అన్నవరం దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలకు డిపోలో సంప్రదించాలని కోరారు.


