News February 25, 2025
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్ల పరిశీలించారు. నగరంలోని పటమట బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.
Similar News
News December 21, 2025
దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పుల మోత.. 10 మంది మృతి

దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జొహన్నెస్బర్గ్కు సమీపంలోని బెకర్స్డాల్ టౌన్షిప్లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు వాహనాల్లో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెలలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
News December 21, 2025
‘ఘోస్ట్’ స్కూల్స్.. టాప్లో బెంగాల్, TG!

మన దేశంలో 5,149 ప్రభుత్వ పాఠశాలలు ఒక్క స్టూడెంట్ కూడా లేకుండా ‘ఘోస్ట్ స్కూల్స్’గా మారాయి. ఇలాంటి 70% స్కూల్స్ తెలంగాణ, వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. TGలోని అన్ని జిల్లాల్లోనూ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉండటం ఆందోళనకరం. ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు, పట్టణ ప్రాంతాలకు వలస, ప్రభుత్వాల ప్రణాళికా లోపమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లలు లేకపోయినా బడ్జెట్ మాత్రం కేటాయిస్తున్నారు.
News December 21, 2025
NZB: GP ఎన్నికల్లో నకిలీ నోట్లు?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నకిలీ నోట్ల కలకలం రేపుతోంది. వర్ని కెనరా బ్యాంకులో ఓ వ్యక్తి రూ.2.08 లక్షల నకిలీ నోట్లు తీసువచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో ఓ వైన్స్ షాపులో నకిలీ రూ.500 నోట్లు మార్చే ముఠాలోని ఇద్దరు నిందితులపై PD యాక్ట్ నమోదు చేశారు. GP ఎన్నిల్లో దొంగనోట్లు పంపిణీ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హాట్ టాపిక్గా మారింది.


