News February 26, 2025
ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: MHBD ఎస్పీ

ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 150 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి ఎస్పీ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో 1663 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు.
Similar News
News November 22, 2025
NRPT: డిజిటల్ అభ్యాసం కోసం QR కోడ్ గోడ పత్రాలు

పదో తరగతి విద్యార్థుల ప్రగతికి తోడ్పడే ప్రాజెక్ట్ శత కార్యక్రమం కింద రూపొందించిన QR కోడ్ గోడ పత్రాలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలిసి విడుదల చేశారు. “చదువుల పండగ – కలలు కనేద్దాం, నేర్చుకుందాం, సాధిద్దాం!” అనే నినాదంతో జిల్లా విద్యా శాఖ వీటిని తయారు చేసింది. ఈ పత్రాల ద్వారా విద్యార్థులు మెరుగైన డిజిటల్ అభ్యాస వనరులను పొందుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
News November 22, 2025
వరంగల్ DCC అధ్యక్షుడిగా మహమ్మద్ ఆయూబ్

వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ ఆయూబ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ నగరానికి చెందిన ఆయూబ్ గతంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి సన్నిహితుడిగా గెలుస్తోంది. దీనికి తోడు ఈసారి మైనార్టీ వర్గానికి అధ్యక్ష పదవి దక్కింది.
News November 22, 2025
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే..?

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాజేంగి నందయ్యను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కల్వకుంట్ల సుజీత్ రావు, జువ్వాడి నర్సింగ రావు కూడా పోటీలో ఉన్నప్పటికీ.. అధిష్ఠానం గాజేంగి నందయ్య వైపు మొగ్గు చూపింది. దీంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


