News February 9, 2025
ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి: మంచిర్యాల కలెక్టర్

జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 17, 2025
వనపర్తిలో తుది విడత 85.55% ఫలితాలు!

వనపర్తి జిల్లాలో పెబ్బేరు, శ్రీరంగాపూర్, పానగల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలలో నిర్వహించిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సరికి అత్యధికంగా పెబ్బేరు 88.71%, అత్యల్పంగా పానగల్ 82.94% పోలింగ్ నమోదయింది. వీపనగండ్ల 84.84%, శ్రీరంగాపూర్ 85.51%, చిన్నంబావి 87.29% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News December 17, 2025
సుల్తానాబాద్: 8 ఓట్ల తేడాతో శైలజ విజయం

సుల్తానాబాద్ మండలం కందునూరు పల్లె గ్రామ సర్పంచి ఎన్నికల్లో చొప్పరి శైలజ ఘన విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో ఆయన ప్రత్యర్థిపై కేవలం ఎనిమిది ఓట్ల తేడాతో విజేతగా నిలిచారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని శైలజ ఈ సందర్భంగా తెలిపారు. ఆయనకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు, అభిమానులు సంబరాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
News December 17, 2025
AIతో అసభ్యకర ఫొటోలు.. బాధించాయన్న శ్రీలీల

ఏఐ సాయంతో SMలో తన ఫొటోలను అసభ్యంగా ఎడిట్ చేయడంపై హీరోయిన్ శ్రీలీల స్పందించారు. ఏఐని అసభ్యత కోసం వినియోగించడాన్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడిస్తూ కోరారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ జీవితాన్ని మరింత సులభతరం చేయాలని, ఇబ్బందులు సృష్టించొద్దని చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏఐని తప్పుగా వినియోగించడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో తమకు మద్దతుగా నిలవాలని అభిమానులను ఆమె కోరారు.


