News February 9, 2025

ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి: మంచిర్యాల కలెక్టర్

image

జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News March 22, 2025

ADB: ఈ నెల 23 నుంచి రెండో విడత కరెక్షన్

image

ఆదిలాబాద్ జిల్లాలోని రెసిడెన్షియల్, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేట్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న వృక్షశాస్త్రం,జంతుశాస్త్ర అధ్యాపకులు ఇంటర్మీడియట్ రెండో విడత మూల్యాంకనంలో పాల్గొనాలని DIEO జాధవ్ గణేశ్ సూచించారు. ఈ నెల 23న జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఈ నెల 24 భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం మూల్యంకనం జరుగుతుందన్నారు. అధ్యాపకులు రిపోర్ట్ చేయాలని కోరారు.

News March 22, 2025

జనగామ: 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి: కలెక్టర్

image

రబీ సీజన్ 2024-25కి సంబంధించి ధాన్యం కొనుగోలుపై శనివారం జనగామ కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సమావేశం నిర్వహించారు. మొత్తం 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేయగా, అందులో 2,35,954 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో 62,013 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, దొడ్డు రకం 1,73,941 మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా వేశామని చెప్పారు.

News March 22, 2025

KMR: స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలి: కలెక్టర్

image

స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం అమలు కోసం జిల్లా మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిజిష్టర్‌ల నిర్వహణ పకడ్బందీగా ఉండేట్లు చూడాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా జడ్జి వర ప్రసాద్ ఉన్నారు.

error: Content is protected !!