News March 12, 2025

ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సలహాలివ్వండి: కలెక్టర్

image

భారత రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులందరిని సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఈ మేరకు రాజకీయ పార్టీలకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ఏప్రిల్ 30 లోపు సలహాలు, సూచనలు అందించాలని ఆమె కోరారు.

Similar News

News December 18, 2025

పుస్తకాల పండుగ రేపటి నుంచే

image

TG: హైదరాబాద్‌లో రేపటి నుంచి నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం 365 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 వరకు బుక్ ఫెయిర్ ఓపెన్‌లో ఉంటుంది. గతేడాది 10 లక్షల మంది వచ్చారని, ఈ ఏడాది 12-15 లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి దివంగత కవి అందెశ్రీ పేరు పెట్టారు.

News December 18, 2025

హన్మకొండ జిల్లాలో ఓట్ల శాతం ఎంతంటే?

image

HNL జిల్లాలో 2019 జనవరిలో జీపీ ఎన్నికలు 7 మండలాల్లోని 130 జీపీలకు జరగగా, ఒంటిమామిడిపల్లి మినహా 129 జీపీలకు 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. 2 ఎన్నికలను పోల్చితే 2019లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. అప్పట్లో ఐనవోలు మండలంలో 90% పోలింగ్ నమోదైంది. ఫేజ్ వారీగా 2019లో తొలి దశ 89.02%, 2వ దశ 86.83%, 3వ దశ 88.80% పోలింగ్ పోలింగ్ కాగా, 2025లో తొలి దశ 83.95%, 2వ దశ 87.34%, 3వ దశలో 86.44% పోలింగ్ అయింది.

News December 18, 2025

ఏలూరు: వృద్ధురాలిపై దాడి.. బంగారు గొలుసు చోరీ

image

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎం. వెంకమ్మ (70)పై ఓదుండగుడు దాడి చేసి, మెడలో ఉన్న రెండున్నర కాసుల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. తిమ్మాపురం నుంచి ఆమె లక్కవరంలో కూతురు మహాలక్ష్మి ఇంటికి వచ్చింది. కూతురు, అల్లుడు బుధవారం పనుల నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో ఘటన జరిగిందన్నారు. గాయపడిన వెంకమ్మను స్థానికులు లక్కవరం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.