News March 21, 2024

ఎన్నికల ప్రధానాధికారి ముందుకు నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) ముఖేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 4గం.లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలన్నారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేదని..? విచారణలో ఏం తేలింది.? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని ఎస్పీని CEO ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎస్పీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని CEO తెలిపారు.

Similar News

News December 18, 2025

‘మాతృ మరణాల నివారణే లక్ష్యం’

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ అధ్యక్షతన డీఎంహెచ్ఓ కార్యాలయంలో మాతృ మరణాలపై సమీక్షా సమావేశం (MDSR) జరిగింది. బిడ్డకు జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదని, ప్రసవ సమయంలో శిశు మృతులు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గర్భిణికి 12 వారాల్లోపు వైద్య పరీక్షలు పూర్తి చేయాలన్నారు. హైరిస్క్ గర్భవతులను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని సూచించారు.

News December 18, 2025

కలెక్టర్ల సదస్సులో సిరి, ఎస్పీ

image

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కొనసాగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సదస్సులో కర్నూలు జిల్లా నుంచి కలెక్టర్ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న పరిపాలనా కార్యక్రమాలు, శాంతిభద్రతల అంశాలపై చర్చించారు. జిల్లాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

News December 18, 2025

సీఎం చంద్రబాబుకు అవార్డు ఏపీకి గర్వకారణం: మంత్రి టీజీ

image

సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి టీజీ భరత్. ఈ అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘దార్శనికత విశ్వాసాన్ని సృష్టిస్తుంది. విశ్వాసం పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుంది’ అంటూ భరత్ ట్వీట్ చేశారు. ఏపీకి ఇది గర్వకారణమైన క్షణం అన్నారు. సీఎం చంద్రబాబు బలమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు.