News March 19, 2024
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి:రిటర్నింగ్ అధికారి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక పాటించాలని, సువిధ యాప్లో అనుమతులు తప్పక తీసుకోవాలని కడప ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, సువిధ యాప్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ECI గైడ్ లైన్స్ ప్రకారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తప్పక పాటించాలని కోరారు.
Similar News
News April 2, 2025
పోరుమామిళ్ల: యువతి ఆత్మహత్య

పెళ్లి కావడంలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోరుమామిళ్ల మండలంలో జరిగింది. పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరువెంగలాపురంలో రామ తులసి(25) అనే యువతి పెళ్లి కావడంలేదని మనస్థాపంతో మంగళవారం ఉరేసుకుంది. మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 2, 2025
ఇడుపులపాయ: IIITల్లో కొత్త కోర్సులు ..!

రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని 4 IIITల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు RGUKT రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులకు మైనర్ డిగ్రీ కింద క్వాంటమ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులోకి రానుందన్నారు. ఇటీవల సమావేశమైన RGUKT 72వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
News April 2, 2025
పులివెందులలో యువకుల మధ్య ఘర్షణ

పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో మంగళవారం రాత్రి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. కొద్దిసేపు యువకులంతా కొట్టుకోవడంతో ప్రజలు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ నరసింహులు అక్కడికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. పట్టణంలో యువకులు మత్తు పానీయాలకు అలవాటు పడి రాత్రి సమయాల్లో గొడవకు పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.