News January 31, 2025

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి: BHPL ఎస్పీ

image

పట్టభద్రులు & ఉపాధ్యాయ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని, జిల్లా పరిధిలో అభ్యర్థులు, ప్రజలు, రాజకీయ నాయకులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, అందరూ పాటించాలని, ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు.

Similar News

News October 24, 2025

రావులపాలెం: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

image

రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన అడపాల కోటమ్మ (61) మృతి చెందింది. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 24, 2025

విజయవాడ బస్టాండ్‌లో నిలువు దోపిడీ..!

image

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లోని స్టాల్స్ నిర్వాహకులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ సహా ప్రతి వస్తువుపై MRP కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. గతంలో ఫిర్యాదులు అందినప్పటికీ, RTC అధికారులు లైట్ తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బస్టాండ్‌ల్లో ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు.

News October 24, 2025

రాజమండ్రి: బాలికపై అత్యాచారం.. ఇద్దరిపై పోక్సో కేసు

image

రాజమండ్రి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటున్న బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ గురువారం తెలిపారు. 20వ తేదీన దీపావళి టపాకాయల కోసం బయటకు వెళ్లిన బాలికను ముందుగానే పరిచయం ఉన్న అజయ్ కుమార్ మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. వార్డెన్ ఫిర్యాదు మేరకు అజయ్, అతని స్నేహితుడు సత్య స్వామిపై కేసు నమోదు చేశారు.