News March 30, 2024
ఎన్నికల బరిలో ఐదుగురు నరసరావుపేట అభ్యర్థులు

పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఐదుగురు టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేయటం సంచలనం రేకెత్తిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాను రాజకీయంగా శాసించిన నరసరావుపేట నేతలు తమకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, గురజాల శాసనసభ నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Similar News
News December 17, 2025
క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్లు.. లోకేశ్ సత్కారం

మహిళా ప్రపంచకప్లో సత్తాచాటిన కడప క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం భారీ నజరానా అందించింది. బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఆమెకు రూ.2.5 కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు. నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీచరణి ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కొనియాడారు.
News December 17, 2025
GNT: అధికారుల నిర్లక్ష్యంపై సీఎం సీరియస్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరుకు చెందిన ఓ అర్జీదారుడికి ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. సమస్య తీరకుండానే పరిష్కారమైనట్లు అధికారులు తప్పుడు నివేదికలు (సెల్ఫీలు) పంపారని తేలింది. సీఎం ఆ అర్జీని ‘రీ-ఓపెన్’ చేయించినా, అధికారులు మళ్లీ పాత పద్ధతిలోనే తప్పుడు సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
News December 17, 2025
గుంటూరు ఎంపీ పనితీరుపై IVRS సర్వే

టీడీపీ MPల పనితీరుపై పార్టీ అధిష్ఠానం IVRS సర్వే చేపట్టింది. మంగళవారం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. 08645417579 అనే నెంబర్ నుంచి సర్వే జరిగింది. ఎంపీ పనితీరు బాగుంటే 1, లేకుంటే 2, చెప్పడం ఇష్టం లేకపోతే 3 నొక్కాలని సర్వేలో కోరారు. ఎంపీలుగా గెలిచి 18 నెలలు అయిన సందర్భంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మరి ప్రజల రెస్పాండ్ ఎలా ఉందో చూడాలి.


