News May 3, 2024

ఎన్నికల బరిలో ముగ్గురు రిటైర్డ్ IASలు

image

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పోటీలో ఉన్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కొప్పుల రాజు కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉండగా, తిరుపతి ఎంపీ బరిలో వెలగపల్లి వరప్రసాద్, విజయకుమార్ ఉన్నారు. వరప్రసాద్ నాలుగోసారి ఎన్నికల సంగ్రామంలో ఉండగా విజయకుమార్ మొదటి సారి పోటీ చేస్తున్నారు.

Similar News

News September 15, 2025

USలో లక్షల జీతం వద్దనుకుని.. నెల్లూరు SPగా

image

USలో లక్షల డాలర్ల జీతం వద్దనుకుని IPS బాట పట్టారు నెల్లూరు కొత్త SP అజిత వాజెండ్ల. గుంటూరు(D)కు చెందిన ఆమె ప్రైమరీ విద్యను AP, మెకానికల్ ఇంజినిరింగ్‌ను మద్రాస్ ITలో పూర్తి చేశారు. అనంతరం USలో భారీ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరారు.అది నచ్చక సివిల్ సర్వీస్‌లోకి రావాలని HYD వర్సిటీలో పబ్లిక్ సర్వీస్‌లో పీహెచ్డీ చదువుతూ సివిల్స్‌కు ఎంపికయ్యారు. నగరంలో పెరుగుతున్న క్రైంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

News September 14, 2025

పార్లమెంటులో నెల్లూరు MP పని తీరు ఇదే.!

image

2024- 25వ సంవత్సరానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనితీరును పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పార్లమెంట్లో ప్రజా సమస్యలపై 73 ప్రశ్నలు సంధించారు. 77.94 శాతం అటెండెన్స్ కల్గి ఉన్నారు. నాలుగు చర్చా కార్యక్రమాలలో పాల్గొని ప్రజావాణి వినిపించినట్లు పార్లమెంట్ వర్గాలు నివేదికను వెల్లడించాయి.

News September 14, 2025

ఇది మన నెల్లూరు కొత్త కలెక్టర్ ప్రేమకథ.!

image

ప్రజలకు సేవా చేయాలన్న తపన వారిద్దరిది. IASకు ప్రయత్నించి ఒకరు మొదటి ప్రయత్నంలో, మరొకరు రెండో ప్రయత్నంలో సెలక్ట్ అయ్యారు. ట్రైనింగ్ పీరియడ్‌లో వాళ్ల మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇది మన నెల్లూరు కొత్త కలెక్టర్ హిమాన్షు శుక్లా-కృతికా శుక్లా ప్రేమ కథ. ప్రస్తుతం ఆమె పల్నాడు కలెక్టర్‌గా పని చేస్తున్నారు. శనివారం ఇద్దరూ బాధ్యతలు చేపట్టారు.