News May 3, 2024
ఎన్నికల బరిలో ముగ్గురు రిటైర్డ్ IASలు

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పోటీలో ఉన్నారు. గతంలో కలెక్టర్గా పనిచేసిన కొప్పుల రాజు కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉండగా, తిరుపతి ఎంపీ బరిలో వెలగపల్లి వరప్రసాద్, విజయకుమార్ ఉన్నారు. వరప్రసాద్ నాలుగోసారి ఎన్నికల సంగ్రామంలో ఉండగా విజయకుమార్ మొదటి సారి పోటీ చేస్తున్నారు.
Similar News
News December 22, 2025
నెల్లూరు: అన్నీ వాట్సాప్లోనే..!

నెల్లూరు జిల్లాలో చాలా ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ మిత్ర ద్వారా అన్ని సేవలు అందిస్తోంది. ప్రజలు 9552300009 నంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయి అని పెడితే మీకు కావాల్సిన సేవలు చూపిస్తుంది. కొత్త రేషన్ కార్డులు, అందులో మార్పులు, చేర్పులకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. 73373 59375 నంబర్కు రైతులు కాల్ చేస్తే ధాన్యం కొనుగోలు వివరాలు సైతం తెలుసుకోవచ్చు.
News December 22, 2025
నెల్లూరు: ఇద్దరు బీటెక్ యువకుల మృతి

నెల్లూరు రూరల్ కొత్త LNTకి చెందిన యుగంధర్ రెడ్డి(21) గూడూరు నారాయణ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్తో కలిసి శ్రీనివాససత్రం బీచ్కు వెళ్లాడు. అలల తాకిడికి యుగంధర్ రెడ్డి కొట్టుకెళ్లి చనిపోయాడు. అలాగే నెల్లూరు సిటీకి చెందిన హర్షసాయి(19) ఒంగోలులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్తో కొత్తపట్నం బీచ్కు వెళ్లాడు. అలల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి హర్షసాయి వెళ్లి చనిపోయాడు.
News December 22, 2025
మీ చిన్నారికి పోలియో చుక్కలు వేయించారా.?

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు 96.12 శాతం మంది చిన్నారులకు సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. మొత్తం 2,94,604 మందికిగాను 2,83,173 మంది పిల్లలకు చుక్కల మందు ఇచ్చారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి ఇవ్వనున్నారు. మరి మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారా.?


