News February 21, 2025

ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓ, ఓపీఒ, మైక్రోఅబ్జర్వర్‌లకు నిర్వహించిన శిక్షణలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి మాట్లాడారు. ఏ ఒక్కరికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు లేదని అందరు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

Similar News

News November 10, 2025

ఇన్‌స్టంట్ లోన్లవైపే ఎక్కువ మంది మొగ్గు

image

వడ్డీ ఎంతైనా ఫర్వాలేదు… పెద్దగా హామీ పత్రాల పనిలేకుండా ఇచ్చే ఇన్‌స్టంట్ లోన్లవైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దీపావళి సీజన్లో ‘పైసాబజార్’ చేపట్టిన సర్వేలో 42% మంది ఈ లోన్లపై ఆసక్తిచూపారు. 25% మంది వడ్డీపై ఆలోచించారు. 80% డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి లోన్లకు ప్రాధాన్యమిచ్చారు. కొత్తగా 41% పర్సనల్ LOANS తీసుకున్నారు. కాగా అనవసర లోన్లు సరికాదని, వాటి వడ్డీలతో కష్టాలే అని EXPERTS సూచిస్తున్నారు.

News November 10, 2025

భీమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం

image

వేములవాడ భీమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో రమాదేవి జ్యోతి వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు భీమేశ్వరాలయం ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదం అందజేశారు.

News November 10, 2025

ఏలూరు: ధాన్యం సేకరణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఏలూరు జిల్లాలో ఖరీఫ్ పంట ధాన్యం కనీస మద్దతు ధర ‘గ్రేడ్-ఎ’ రకం క్వింటాల్‌కు రూ.2,389, కామన్ రకం రూ.2,369 చొప్పున నిర్ణయించినట్లు సివిల్ సప్లై మేనేజర్ శివరామమూర్తి సోమవారం తెలిపారు. జిల్లాలో 234 రైతు సేవా కేంద్రాలు, 102 ఏజెన్సీల ద్వారా దాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా 18004256453, 7702003584 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.