News February 21, 2025
ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓ, ఓపీఒ, మైక్రోఅబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి మాట్లాడారు. ఏ ఒక్కరికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు లేదని అందరు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
Similar News
News January 8, 2026
‘రాజాసాబ్’ తొలి రోజే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందా?

రేపు విడుదలయ్యే ప్రభాస్ ‘రాజాసాబ్’పై అభిమానులతో పాటు నిర్మాత విశ్వప్రసాద్ భారీ ఆశలు పెట్టుకున్నారు. తొలిరోజే రూ.100Cr కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నామన్న ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రీమియర్ షోకు రూ.1000, తొలి 10రోజులు టికెట్ రేట్ను మల్టిప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించడం కలిసొచ్చే అంశం. మరి తొలిరోజే రూ.100Cr కలెక్ట్ చేస్తుందా? COMMENT
News January 8, 2026
ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభం.. అజెండాలో 35 అంశాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సుమారు 35 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలు, బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణ తదితర అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
News January 8, 2026
రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్-2 మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్

నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్న వ్యక్తులకు సహకరించిన రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2 కె.మధుసూధన్ రెడ్డిని రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. అంతే కాదు.. మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దీన్ని సీరియస్గా తీసుకున్నారు.


