News February 23, 2025
ఎన్నికల విధులపట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల పట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ఈనెల 27న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభధ్రుల ఎన్నికలపై శిక్షణ ఇచ్చారు.
Similar News
News December 5, 2025
కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.
News December 5, 2025
కుడా భవనం ఆ అల్లుడి కోసమేనా..?

కుడా భవనంను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి రంగం సిద్దమైంది. ప్రభుత్వ డబ్బులతో కట్టిన బిల్డింగ్ను, నిర్వహణ భారం పేరిట ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడానికి ఈనెల 15వ తేదీని టార్గెట్గా నిర్ణయించారు. కుడా కార్యాలయంలోని 8 విభాగాలను, ప్రధాన కార్యాలయాన్ని, కాళోజీ కళా క్షేత్రానికి తరలించాలని నిర్ణయించారు. లీజ్ పేరిట ప్రస్తుత కుడా కార్యాలయాన్ని ఓ నేత అల్లుడికి ఆసుపత్రి కోసం ఇస్తున్నట్టు సమాచారం.
News December 5, 2025
ప్రకాశం: PTMకు ముస్తాబైన పాఠశాలలు

జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని 2,409 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాన్ని జరపాలని అన్నారు. PTM కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పాఠశాలల్లో పూర్తి చేసి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాబు చేశారు.


