News May 11, 2024

ఎన్నికల విధుల్లో పారదర్శకం పనిచేయాలి: అనంత కలెక్టర్

image

అనంతపురం జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం ఎన్నికల సెక్టోరియల్, పోలీస్ అధికారులు, అసెంబ్లీ స్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పారదర్శకంగా పని చేయాలని కోరారు. పోలింగ్ సిబ్బంది నిబంధనలకు లోబడి పని చేయాలని అన్నారు.

Similar News

News February 14, 2025

అనంత: ‘బాయ్ ఫ్రెండ్ నా నంబర్ బ్లాక్ చేశాడు.. డయల్ 100కు యువతి ఫోన్’

image

డయల్ 100కు ఫోన్ చేసి ఓ యువతి సాయం కోరడం చర్చనీయాంశమైంది. ‘సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నంబర్ బ్లాక్ చేసి మాట్లాడట్లేదు. వాడితో మాట్లాడి అన్‌బ్లాక్ చేయించండి’ అని గుత్తి ఆర్ఎస్‌కు చెందిన యువతి కోరింది. కంట్రోల్ రూమ్ వారు స్థానిక పోలీసులకు తెలపడంతో కానిస్టేబుల్ సుధాకర్ ఆమెను సంప్రదించారు. అయితే తన ఇంటికి రావొద్దని, వాడితో మాట్లాడి అన్‌బ్లాక్ చేయించాలని కోరడంతో బాయ్ ఫ్రెండ్‌‌తో మాట్లాడేందుకు యత్నించారు.

News February 14, 2025

అనంత: ప్రణతికి డాక్టరేట్

image

అనంతపురానికి చెందిన ఓ.ప్రణతి గురువారం డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో ‘పట్టణ, గ్రామీణ రాజకీయాలలో మహిళల పాత్ర’ అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న ఆమెను సిబ్బంది అభినందించారు.

News February 14, 2025

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా చిట్లూరు రమేశ్ గౌడ్

image

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురానికి చెందిన చిట్లూరు రమేశ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. వైసీపీలో తనకు రాష్ట్రస్థాయి పదవిని కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

error: Content is protected !!