News February 15, 2025

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తపాలా బ్యాలెట్‌కు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఫిబ్రవరి 27న జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే సిబ్బంది వారి ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చునన్నారు. ఆయా ఎన్నికల అధికారులు గమనించాలన్నారు తెలిపారు.

Similar News

News November 18, 2025

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎన్పీడీసీఎల్ సీఎండీ

image

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధకంపై ఆయన ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మోహన్ రావు, తిరుపతి రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

News November 18, 2025

పాలమూరు: పరీక్షల టైం టేబుల్ విడుదల..!

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో జరగనున్న 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ B.Ed (B.Sc. B.Ed. & B.A. B.Ed.) సెమిస్టర్ 1 (రెగ్యులర్) పరీక్షల తేదీలు (టైం టేబుల్)ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.palamuruuniversity.comను చూడండి.

News November 18, 2025

మెదక్: ‘పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలి’

image

టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్ల లోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలనడం ఉపాధ్యాయులను ఎంతో మనోవేదనకు గురిచేస్తుందన్నారు. 25, 30 సంవత్సరాల సర్వీసు కలిగిన ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ రాసి పాస్ కావడం అంటే చాలా శ్రమ, వేదనతో కూడుకున్నదన్నారు.