News June 18, 2024
ఎన్పీడీసీఎల్: విద్యుత్ సమస్యలపై 362 ఫిర్యాదులు
వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఎన్పీడీసీఎల్ అధికారులు సోమవారం ‘విద్యుత్ ప్రజావాణి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 16 జిల్లాల్లోని సర్కిల్ కార్యాలయాల నుంచి కింది స్థాయి సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యుత్ సంబంధిత అంశాలు, సమస్యలపై తొలి రోజు 362 ఫిర్యాదులు వచ్చాయి.
Similar News
News October 6, 2024
MLG: ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాల
విద్యార్థులు, యువత ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దనసరి సూర్య అన్నారు. తాడ్వాయి మండలంలోని మేడారంలో నిర్వహించిన కరాటే శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాడ్వాయి అధ్యక్షుడు బొల్లు దేవేందర్ గౌడ్ పాల్గొన్నారు.
News October 6, 2024
వరంగల్ మార్కెట్ రేపు పున:ప్రారంభం
2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు నేపథ్యంలో మార్కెట్ బంద్ అయింది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News October 6, 2024
GREAT.. జనగామ: ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు
ఒకే ఇంట్లో అన్నా చెల్లెలు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్య కొడుకు మహేశ్ కుమార్, కూతురు మౌనికలు ఇటీవల విడుదలైన డీఎస్సీ(SGT) ఫలితాల్లో వరుసగా 5, 15వ ర్యాంక్లు సాధించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి బీడీలు చేసి వీరిని చదివించింది.