News June 18, 2024

ఎన్పీడీసీఎల్: విద్యుత్ సమస్యలపై 362 ఫిర్యాదులు

image

వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఎన్పీడీసీఎల్ అధికారులు సోమవారం ‘విద్యుత్ ప్రజావాణి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 16 జిల్లాల్లోని సర్కిల్ కార్యాలయాల నుంచి కింది స్థాయి సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యుత్ సంబంధిత అంశాలు, సమస్యలపై తొలి రోజు 362 ఫిర్యాదులు వచ్చాయి.

Similar News

News January 21, 2026

WGL: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు అమర్చి బోర్డు సర్వర్‌కు అనుసంధానం చేశారు. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

News January 21, 2026

వరంగల్‌: ‘స్కాలర్‌షిప్‌ విద్యార్థులు ఆధార్‌ లింకు చేసుకోవాలి’

image

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాలను వెంటనే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత సూచించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1356 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోగా, అందులో 872 మంది ఇంకా ఆధార్ లింకింగ్ పూర్తి చేయలేదని వెల్లడించారు.

News January 21, 2026

గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు: వరంగల్ కలెక్టర్

image

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, మత్తు పదార్థాలకు అలవాటు పడితే కలిగే నష్టాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.