News January 29, 2025
ఎప్పుడో అయిపోయిన దావోస్కు ఇప్పుడు దావత్ ఎందుకు: హరీశ్ రావు

ఎప్పుడో అయిపోయిన దావోస్కు ఇప్పుడు దావత్ ఎందుకని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X” వేదికగా ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దావోస్ పెట్టుబడుల కట్టుకథలు నమ్మించే ప్రయత్నం చేసి అట్టర్ ప్లాప్ అయ్యారని విమర్శించారు. దావోస్ లో జరిగే ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని, ఎవరైనా ఓపెన్ టెండర్లో రావాల్సిందే అన్నారు. పొంతనలేని లెక్కలు చెప్తున్నారని విమర్శించారు.
Similar News
News October 16, 2025
పాలమూరు: మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025- 26 విద్యా సంవత్సరానికి గద్వాల జిల్లాలో ఉన్న బాలబాలికల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TGSWRS జిల్లా సమన్వయ అధికారి రామాంజనేయులు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ దరఖాస్తులను ఈనెల 18వ తేదీన సాయంత్రం 05 గంటల లోపు ఎర్రవల్లిలోని TGSWRS, DCO కు సమర్పించాలని సూచించారు.
News October 16, 2025
PHOTO GALLERY: శ్రీశైలంలో PM మోదీ

AP: ప్రధాని మోదీ శ్రీశైల మల్లన్న సేవలో తరించారు. సంప్రదాయ దుస్తులు ధరించి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. శ్రీశైల ఆలయంలో మోదీ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News October 16, 2025
మద్దూరు: చెరువులో వ్యక్తి మృతి.. UPDATE

మద్దూరు పట్టణ కేంద్రంలో సంకం చెరువులో ఈ రోజు ఉదయం ఓ వ్యక్తి మృతదేహం పైకి తెలిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా వట్పల్లి గ్రామానికి చెందిన శేఖర్(42) మద్దూరులో రవి స్క్రాప్ షాపులో పనిచేస్తున్నాడు. 6 రోజుల శనివారం తెల్లవారుజామున కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ప్రమాదవశాత్తు ఆయన చెరువులో మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.