News February 27, 2025
ఎమ్మిగనూరులో చోరీ

ఎమ్మిగనూరులో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. తిరుమల నగర్కు చెందిన బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు చోరీకి చొరబడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో బాధితులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. రూ.7లక్షల విలువైన బంగారం, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారని చెప్పారు.
Similar News
News December 9, 2025
HYD: గ్రేట్.. 9 మందికి ప్రాణం పోశారు!

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడకు చెందిన ముత్తులూరు కృష్ణకుమారి (58), నల్గొండ రైతు పల్లపు ప్రశాంత్ (27) బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబాలు అవయవదానానికి ముందుకొచ్చాయి. ఈ మహోన్నత నిర్ణయం ద్వారా కిడ్నీలు, లివర్, గుండె, కళ్లను సేకరించి 9 మందికి ప్రాణం పోశారు. తమ బాధను పక్కన పెట్టి చూపిన వీరి త్యాగం అందరికీ స్ఫూర్తినిచ్చింది. అవయవదానం చేద్దాం.. ఆపదలో ఉన్నవారికి ఊపిరిపోద్దాం.
News December 9, 2025
అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్ జారీ చేసింది. అయ్యప్ప ఆలయానికి సమీపంలో ఉన్న ఉరక్కుళి జలపాతం వద్దకు వెళ్లొద్దని సూచించింది. ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరగడం, ఏనుగులు, వన్యప్రాణుల సంచారం కూడా పెరగడం, ఆ మార్గం ఏటవాలుగా, జారుడుగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ సూచనలు చేసింది. సాధారణంగా అడవిలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు ఈ జలపాతం వద్ద ఆగి స్నానాలు ఆచరిస్తారు.
News December 9, 2025
విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న CM

CM చంద్రబాబు ఈనెల 12న విశాఖలో పర్యటించనున్నారు. ముందుగా మధురవాడ ఐటీ సెజ్ హిల్-2లో ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వీఈఆర్ సమావేశానికి హాజరై, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేస్తారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.


