News April 16, 2025
ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్లో 987 మార్కులు సాధించిన యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.
Similar News
News November 19, 2025
నగరంలో 3 స్థానాలకు ఉపఎన్నికలు?

పార్టీ ఫిరాయించిన MLAలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ తీవ్రజాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే HYDలో తర్వలో 3స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయనే చర్చ నడుస్తోంది. ఖైరతాబాద్ MLA దానంనాగేందర్, శేరిలింగంపల్లి MLA అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ MLA ప్రకాశ్గౌడ్, RRలోని చేవెళ్ల MLA కాలె యాదయ్య పార్టీ ఫిరాయించారని, అక్కడ బైపోల్ అనివార్యమని BRS చెబుతూనే ఉంది.
News November 19, 2025
పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 19, 2025
కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. బీబీపేట 9.3°C, లచ్చపేట 9.5, గాంధారి 9.6, డోంగ్లి, నస్రుల్లాబాద్ 9.7, బొమ్మన్ దేవిపల్లి, మేనూర్లలో 9.8, రామలక్ష్మణపల్లి 9.9, సర్వాపూర్ 10, బీర్కూర్ 10.2, జుక్కల్ 10.5, ఇసాయిపేట,రామారెడ్డి, ఎల్పుగొండ 10.6, పుల్కల్ 11, దోమకొండ 11.1, బిక్కనూర్ 11.3°C నమోదయ్యాయి.


