News April 16, 2025
ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్లో 987 మార్కులు సాధించిన యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.
Similar News
News November 23, 2025
పెద్దపల్లి: ‘DEC 5లోపు APPLY చేసుకోవాలి’

డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, టెక్నికల్ కోర్సుల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు ఆసక్తిగల అభ్యర్థులు DEC 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని PDPL జిల్లా(INCHARGE) విద్యాశాఖ అధికారి శారద తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులు లోయర్ గ్రేడ్కు, లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణులు హయ్యర్ గ్రేడ్కు అర్హులు. దరఖాస్తులను www.bse.telangana.gov.inలో సమర్పించి, ఫారాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
News November 23, 2025
తిరుపతి: తెలుగు, సంస్కృతానికి పెద్దపీట వేసేనా..?

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ 2022లో ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తరువాత తిరుపతిలోనే రాష్ట్ర కార్యాలయం ఉన్నా పరిపాలన మాత్రం విజయవాడ నుంచి సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛైర్మన్గా విల్సన్ తొలిసారి తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయ అభివృద్ధికి పెద్దపీట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
News November 23, 2025
నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


