News January 25, 2025
ఎమ్మెల్యేకు జ్ఞాపిక అందజేసిన ఆలయ నిర్వాహకులు

సంగారెడ్డి పట్టణంలోని శ్రీ విరాట్ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్కు ఆలయ నిర్వాహకులు జ్ఞాపికను అందజేశారు. ఈనెల 31వ తేదీ మాఘమాసం ఆరంభం నుంచి శ్రీవారి పుష్కరిణి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న దృష్ట్యా, ఉత్సవాలకు ఆలయ కమిటీ బాధ్యులు ఎమ్మెల్యేకు ఆహ్వానించారు. ఇందులో కమిటీ సభ్యులు డాక్టర్ అరుణ తదితరులు ఉన్నారు.
Similar News
News October 29, 2025
VKB: నకిలీ కరెన్సీ.. ఇద్దరికి 10ఏళ్ల జైలు శిక్ష

నకిలీ కరెన్సీ కేసులో ఇద్దరికి 10ఏళ్ల జైలు శిక్ష రూ.20 వేలు జరిమానా కోర్టు విధించింది. 2016లో A1 గోడాల అలవేలు, A2 గణేశ్ రెడ్డి విజయ బ్యాంకులో నకిలీ నోట్లను డిపాజిట్ చేయడానికి వచ్చారు. బ్యాంకు మేనేజర్ గుర్తించి పెద్దేముల్ PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీంతో నిందితులకు ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి డా.ఎస్.శ్రీనివాస్ రెడ్డి శిక్ష విధించినట్లు SP K.నారాయణ రెడ్డి తెలిపారు.
News October 29, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్ విద్యార్థి

నవంబర్లో గుంటూరులో జరగబోయే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్.షాకీర్ ఎంపికైనట్టు పాఠశాల హెడ్మాస్టర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సుదర్శన్ రావు, శేఖర్ మీడియాతో మాట్లాడారు. కర్నూలులో జరిగిన ఎంపిక పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి ఉద్యమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు తెలిపారు.
News October 29, 2025
వరంగల్: పక్షుల కోసం గూళ్లు..!

వరంగల్(D) పర్వతగిరి(M) కల్లెడలోని ఓ పాఠశాలలో పక్షులకు ఆహారం, నీరు అందించడానికి గాను ప్రత్యేకంగా గూళ్లను ఏర్పాటు చేశారు. రేకు డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్లు, వెదురు బుట్టలను పక్షుల గూళ్ల మాదిరిగా తయారుచేసి పాఠశాల ఆవరణలోని చెట్లకు వేలాడదీశారు. అందులో గింజలతో పాటు నీళ్లను పెట్టడంతో పక్షులు అక్కడికి వచ్చి తమ ఆకలిని, దాహర్తిని తీర్చుకుంటున్నాయి. దీంతో నిర్వాహకులను పలువురు అభినందిస్తున్నారు.


