News December 31, 2024
ఎమ్మెల్యేలకు అచ్చొచ్చిన 2024
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలువురు రాజకీయ నాయకులకు 2024 సంవత్సరం కలిసొచ్చింది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేశ్, నెలవల విజయశ్రీ, ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. వీరి రాజకీయ జీవితంలో 2024 శాశ్వతంగా గుర్తుండిపోనుంది.
Similar News
News January 13, 2025
మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
మనుబోలు మండలం, కాగితాలపూరు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 13, 2025
నెల్లూరు: భోగి మంట వేస్తున్నారా..?
సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 13, 2025
నెల్లూరు జిల్లా వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు
జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జిల్లా వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను జిల్లా వాసుల సుఖసంతోషాలతో జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంట సిరి సంపదలు, భోగభాగ్యాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు.