News October 22, 2024

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రీల్స్.. యాదగిరిగుట్ట ఈఓ స్పందన

image

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై ఆలయ ఈఓ భాస్కర్ రావు స్పందించారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసం దెబ్బతినే విధంగా వ్యక్తిగత ఫొటో, వీడియో చిత్రీకరణ చేయవద్దు అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఆలయ దర్శనం, తగిన గౌరవం ఇస్తామని తెలిపారు. అందరి మాదిరిగా ఆలయం బయట మాత్రమే ఫొటోలు దిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

Similar News

News November 21, 2025

మార్కెట్లో మండిపోతున్న కూరగాయల ధరలు

image

నల్లగొండ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి కూరగాయల ధరలు సామాన్యుడికి అందకుండా పైపైకి ఎగబాకుతున్నాయి.టమాటా కిలో 50 రూపాయలు,చిక్కుడుకాయ కిలో 140, గోకర, బెండకాయ,బీరకాయ కిలో 120, దోసకాయ కిలో 60, వంకాయ కిలో 80, క్యారెట్ కిలో120 రూపాయలకు అమ్ముతున్నారు.దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇటీవల తుఫాను ప్రభావంతోనే కూరగాయల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

News November 21, 2025

దేవరకొండ ASP మౌనిక ఆదిలాబాద్‌కు బదిలీ

image

దేవరకొండ ఏఎస్పీ మౌనిక బదిలీ అయ్యారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆమె ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన వారిలో ఆమె ఒకరు. ఏఎస్పీగా ఇక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.

News November 21, 2025

NLG: వడివడిగా అడుగులు… ఏర్పాట్లపై ఈసీ కసరత్తు

image

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడుగులు చకచకా పడుతున్నాయి. తొలుత GP ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి రాగా ఎన్నికల సంఘం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనెల 23న జిల్లాలో ఓటర్ల తుది జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల వివరాలను విడుదల చేయనున్నారు. ఇతర ఏర్పాట్లపైనా దృష్టి సారించగా.. ఈనెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.