News October 22, 2024

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రీల్స్.. యాదగిరిగుట్ట ఈఓ స్పందన

image

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై ఆలయ ఈఓ భాస్కర్ రావు స్పందించారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసం దెబ్బతినే విధంగా వ్యక్తిగత ఫొటో, వీడియో చిత్రీకరణ చేయవద్దు అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఆలయ దర్శనం, తగిన గౌరవం ఇస్తామని తెలిపారు. అందరి మాదిరిగా ఆలయం బయట మాత్రమే ఫొటోలు దిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

Similar News

News November 18, 2025

నల్గొండ: రూ.15 లక్షల టోకరా: మహిళా సంఘాలు

image

తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ మహిళా పొదుపు సంఘం సభ్యులు రూ.15 లక్షల మేర మోసపోయామంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. లింగంపల్లి ఆర్‌పీ ఫీల్డ్ అసిస్టెంట్‌తో కుమ్మక్కై శ్రీ భవానీ సమభావన సంఘం సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డులు వాడి, సంతకాలు ఫోర్జరీ చేసి సంఘం పేరుపై సుమారు రూ.15 లక్షల రుణం తీసుకున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై తాము కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.

News November 18, 2025

నల్గొండ: రూ.15 లక్షల టోకరా: మహిళా సంఘాలు

image

తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ మహిళా పొదుపు సంఘం సభ్యులు రూ.15 లక్షల మేర మోసపోయామంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. లింగంపల్లి ఆర్‌పీ ఫీల్డ్ అసిస్టెంట్‌తో కుమ్మక్కై శ్రీ భవానీ సమభావన సంఘం సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డులు వాడి, సంతకాలు ఫోర్జరీ చేసి సంఘం పేరుపై సుమారు రూ.15 లక్షల రుణం తీసుకున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై తాము కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.

News November 17, 2025

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఇలా త్రిపాఠి

image

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు సంబంధించినవి వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు.