News August 2, 2024
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అసత్య ప్రచారాలు: రామ్మోహన్ రెడ్డి

పాలకుర్తి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి లేగ రామ్మోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి రిజర్వాయర్కు రీటెండర్ వేసి రూ.370 కోట్ల నుంచి రూ. 470 కోట్లకు పెంచారని ఆరోపించారు. 30 కి.మీ మేర కెనాల్ కాలువలను తవ్వించారని ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
సమర్థవంతంగా చేరేలా సమన్వయంతో పని చేయాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే

వరంగల్ జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు సూచించారు. వరంగల్ దిశా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రహదారి నిర్మాణాలు, కల్వర్టులు, గ్రామీణ అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దిష్ట కాలానికి పూర్తిచేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పారదర్శకత పాటించాలన్నారు.
News November 21, 2025
వరంగల్: కలెక్టర్కు ఎమ్మెల్సీ సారయ్య శుభాకాంక్షలు

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరి-2లో వరంగల్ జిల్లాకు మొదటి స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం MLC బసవరాజు సారయ్య వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారదను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో జల సంరక్షణ చర్యలను విజయవంతంగా చేపట్టి రాష్ట్రానికి ప్రతిష్ఠ తెచ్చారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.
News November 20, 2025
వరంగల్: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల కోసం చెక్పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేని ఇసుక రవాణాపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విజిలెన్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


