News September 24, 2024
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోండి: కలెక్టర్ క్రాంతి

ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.
Similar News
News December 17, 2025
మెదక్: ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. నీలిమ పిలుపునిచ్చారు. న్యాయమూర్తులతో కలిసి ఆమె మాట్లాడారు. ఎక్కువ సంఖ్యలో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించేలా చొరవ చూపాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్ ద్వారా గరిష్ఠ స్థాయిలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
News December 17, 2025
నర్సాపూర్ ఎమ్మెల్యే స్వగ్రామంలో కాంగ్రెస్ విజయం

శివంపేట మండలంలో గోమారం సర్పంచిగా కుమ్మరి హిమవతి ఆంజనేయులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి హిమవతి సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, గోమారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగ్రామం.
News December 17, 2025
మెదక్: మండలాల వారీగా పోలింగ్ శాతం

మెదక్ జిల్లాలో మూడో విడత 7 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా 90.68 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ఒంటిగంట తర్వాత నమోదైన ఓటింగ్ శాతం.. చిలపిచెడు మండలంలో 90.02, కౌడిపల్లి 90.80, కుల్చారం 89.20, మాసాయిపేట 88.90, నర్సాపూర్ 93.38, శివంపేట 92.57, వెల్దుర్తి 87.62 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.


