News February 5, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: NRML కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం NRML కలెక్టరేట్ సమావేశం మందిరంలో నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
Similar News
News November 18, 2025
ములుగు: హిడ్మా దళంలో ఆరుగురేనా..?

పోలీస్ బలగాలను ముప్పతిప్పలు పెట్టిన హిడ్మా ఎన్కౌంటర్పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హిడ్మా పేరు తెలియని వాళ్లు లేరు. అయితే మోస్ట్ వాంటెడ్, రూ. కోటి రివార్డుతో పాటు, సీసీ కమిటీ మెంబర్గా ఉన్న హిడ్మా మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కర్రెగుట్టల ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న హిడ్మా దళంలో కేవలం ఆరుగురు ఉండడం గమనార్హం.
News November 18, 2025
నామినేటెడ్ పోస్టుల్లో అర్బన్ నక్సల్స్: బండి సంజయ్

అర్బన్ నక్సల్స్ నామినేటెడ్ పోస్టులు, కమీషన్లు వచ్చే పదవుల్లో కొనసాగుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంతో అర్బన్ నక్సల్స్ కుమ్మక్కై నామినేటెడ్ పోస్టులు, కమిషన్ పదవులు అనుభవిస్తున్నారన్నారు. వారి మాయ మాటలు నమ్మి అమాయక దళిత, గిరిజనులు తుపాకీ పట్టుకుని అడవుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
News November 18, 2025
అనకాపల్లి: ‘టీచర్లు సమస్యలు పరిష్కరించాలని వినతి”

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లిలో డీఈవో అప్పారావు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు సెలవు పెడితే వారి స్థానంలో సర్ప్లస్ టీచర్స్ను డిప్యూటేషన్పై పంపించాలన్నారు. 2024-25లో స్పాట్ వాల్యూషన్ ఉపాధ్యాయులకు డీఏ చెల్లించాలన్నారు.


