News February 2, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు 23 పోలింగ్ కేంద్రాలు: భద్రాద్రి అ.కలెక్టర్

image

WGL-KMM-NLG టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. శనివారం అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1949 మంది ఓటర్లకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో పురుషులు 1038, మహిళలు 911 మంది ఉన్నారన్నారు.

Similar News

News December 9, 2025

జగిత్యాల: నేటితో ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర..!

image

జగిత్యాల జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాలలో నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉంది. ఇప్పటికే మందు, విందులతో జోరుగా దావతులు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి పలువురు అభ్యర్థులు ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

News December 9, 2025

విజయ్‌ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

image

కరూర్ తొక్కిసలాట తర్వాత TVK చీఫ్‌, నటుడు విజయ్ తొలిసారి ప్రజల మధ్యకు వస్తున్నారు. నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాలంలోని ఎక్స్‌పో గ్రౌండ్‌లో అధికారులు భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడు శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా గుర్తించారు.

News December 9, 2025

బాపట్ల జిల్లాలో జాతీయ స్థాయి యోగా పోటీలు

image

బాపట్ల జిల్లా జాతీయ స్థాయి యోగాసన పోటీలకు వేదిక కానుంది. బాపట్ల మండలం జిల్లెల్లమూడిలో డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. మంగళవారం ఆయన వేదికను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులకు వసతి కల్పిస్తున్నామన్నారు. యోగా విశిష్టతను చాటేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.