News February 13, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులకు కలెక్టర్ సూచనలు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను బాధ్యతగా స్వీకరించి నిష్పక్షపాతంగా విజయవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్లో ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పివో, ఏపివో లకు మొదటి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈనెల 27న ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు.
Similar News
News November 7, 2025
నరసాపురం వరకు వందేభారత్ రైలు

AP: చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ రైలు 5.30AMకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు చేరుతోంది. ఇకపై అక్కడి నుంచి గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురానికి 2.10PMకు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 3.20PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.
News November 7, 2025
హిందువులు సత్తా చాటాలి: MP డీకే అరుణ

2 లక్షలకు పైగా ఉన్న హిందువులంతా ఏకమై జూబ్లీహిల్స్ ఊప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బోడబండలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు.
News November 7, 2025
ధర్మం కోసం బతకండి..

వివిధ సందర్భాల్లో పుట్టపర్తి సత్యసాయి బాబా చెప్పిన సూక్తులు..
★ ఆహారాన్ని భగవంతుడి కానుకగా భావించి, తినేముందు భగవంతుడికి సమర్పించండి
★ నామస్మరణ చేయండి, మీ నాలుక మధురం అవుతుంది, మీకు మంచి కలుగుతుంది
★ కేవలం అన్నం కోసం కాక, ధర్మం కోసం బతకండి
★ సూర్యునివలే ప్రతి మానవుడు నిరహంకారిగా తయారుకావాలి.


