News February 1, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్‌లతో సీఈఓ వీడియో సమావేశం

image

శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. కలెక్టర్ తేజస్, అ.కలెక్టర్ పి. రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 24, 2025

అరటి, కొబ్బరి ఉత్పత్తులకు ఇంక్యుబేషన్ కేంద్రాలు: కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం సమీపంలో అరటి, అమలాపురం పరిసర ప్రాంతాలలో కొబ్బరి ఉత్పత్తుల తయారీపై శిక్షణ, ఉత్పత్తుల ప్రోత్సాహకం కోసం ఇంక్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉద్యాన విశ్వవిద్యాలయం, ఫుడ్ ప్రాసెసింగ్ శాస్త్రవేత్తలు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి, ఇంక్యుబేషన్ సెంటర్ల వారితో చర్చించారు.

News October 24, 2025

వరంగల్: రైతులకు నిరాశ.. తగ్గిన మిచ్చి ధరలు..!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారంతో పోలిస్తే శుక్రవారం అన్ని రకాల మిర్చి ధరలు తగ్గాయి. తేజా మిర్చి క్వింటాకు గురువారం రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000 ధర వచ్చింది. అలాగే, 341 రకం మిర్చి గురువారం రూ.15,849 ధర వస్తే.. శుక్రవారం రూ.15,500 అయింది. వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.16,800 ధర వస్తే.. నేడు రూ.16,100కి పడిపోయింది.

News October 24, 2025

MDK: ‘ఆశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం’

image

రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగ యువతను ఆశపెట్టిందని చెప్పొచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. దీంట్లో సిబిల్ స్కోర్‌ను బట్టి లబ్దిదారుల ఎంపిక నిర్వహిస్తున్నారు. ఐతే ఇప్పటికీ ఈ పథకం పై లబ్ధిదారుల వివరాలు అధికారులు తెలపలేదు. ఈ పథకం ద్వారా సొంత వ్యాపార నిమిత్తం రూ.5 లక్షల రుణం ప్రభుత్వం ఇస్తుంది. ఆశ పెట్టి వదిలేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.