News February 25, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. 200 మంది పోలీస్ ఫోర్స్: ములుగు SP

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ శబరీశ్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాల వద్ద 200 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, బూత్ వద్ద 100, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు.

Similar News

News January 3, 2026

Silver MFs vs ETFs: ఇన్వెస్ట్ చేయడానికి ఏది బెస్ట్?

image

వెండి ధరల పెరుగుదల నేపథ్యంలో డీమ్యాట్ ఖాతా ఉండి ట్రేడింగ్‌పై అవగాహన ఉన్నవారికి తక్కువ ఖర్చుతో కూడిన Silver ETFs ఇన్వెస్ట్‌మెంట్స్‌కు బెస్ట్ ఆప్షన్. వీటిపై ఏడాది తర్వాత వచ్చే లాభాలపై 12.5% పన్ను వర్తిస్తుంది. డీమ్యాట్ లేనివారు, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పొదుపును కోరుకునే వారు Silver Mutual Funds ఎంచుకోవచ్చు. వెనువెంటనే క్రయవిక్రయాలు జరిపేవారికి ETFs, స్థిరమైన పెట్టుబడికి MFs బెస్ట్ ఆప్షన్స్.

News January 3, 2026

కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఊపిరి పోసిన ‘పవన్’

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఊపిరి పోశారు. భక్తుల సౌకర్యార్థం TTD నిధులతో రూ. 35.19 కోట్ల భారీ వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అందులో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా 96గదుల సత్ర నిర్మాణంతోపాటు, ఒకేసారి సుమారు 2000మంది భక్తులు దీక్ష విరమణ చేసేల మండపాన్ని నిర్మించనున్నారు. దీంతో కొండగట్టు ఆలయ రూపురేఖలు మారనున్నాయి.

News January 3, 2026

బంగ్లాదేశ్‌లో మరో హిందువు మృతి

image

బంగ్లాదేశ్‌లో ఇటీవల <<18733577>>మూకదాడి<<>>లో తీవ్రంగా గాయపడ్డ హిందూ వ్యాపారి ఖోకన్ దాస్ మృతిచెందారు. డిసెంబర్ 31న షరియత్‌పూర్ జిల్లాలో ఆయనపై ఓ గుంపు కత్తులతో దాడి చేసి నిప్పు అంటించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన చెరువులోకి దూకినా తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇప్పటికే అమృత్ మండల్, దీపూ దాస్ వంటి హిందువులు ఈ తరహా దాడుల్లో బలైన విషయం తెలిసిందే.