News February 12, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్నవారికి క్యాజువల్ లీవ్: కలెక్టర్

image

ఈనెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News September 18, 2025

ఏటిగట్టు వద్ద సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ వేడుకలు!

image

బతుకమ్మ వేడుకలకు MHBD జిల్లా సిద్ధమవుతోంది. జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు, రామ మందిరం, వేంకటేశ్వరస్వామి గుడి, హనుమంతుని గడ్డ, బంధం చెరువు, NTR స్టేడియం, మరిపెడ-MPDO కార్యాలయం, డోర్నకల్‌లో ఊర చెరువు, కురవిలో పెద్ద చెరువు, కేసముద్రంలో దర్గా చెరువు, గార్లలో పాకాల ఏరు, దంతాలపల్లి రామలింగేశ్వర టెంపుల్, ఇనుగుర్తి బంగారు కత్వగుంటి, బేడీచెరువు, గూడూరులోని ఏటిగట్టు వద్ద సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడుతారు.

News September 18, 2025

GNT: సీజనల్ వ్యాధుల సమాచారానికి కంట్రోల్ రూమ్

image

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాదులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని,  ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014  నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.

News September 18, 2025

రాజమండ్రి: నూతన కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఎస్పీ

image

తూ.గో జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరిని గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.