News February 12, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్నవారికి క్యాజువల్ లీవ్: కలెక్టర్

ఈనెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
ASF: డీసీసీ.. అందరి చూపూ ఢిల్లీ వైపు..!

ఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీల ఎన్నిక అంశం ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీలో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ సారి కొత్త నిబంధనలు, ఎంపిక విధానాల తీరు మారింది. దీంతో ఎవరిని అధ్యక్ష పీఠం వరిస్తుందో అనే చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. తుది ఎంపిక ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. గతంలో స్థానిక ఎమ్మెల్యేలు, సీఎం, పీసీసీ చీఫ్ తుది నిర్ణయమే ఫైనల్గా ఉండేది.
News October 26, 2025
నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్లో ఉద్యోగాలు

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/MD/MPH/MBA/ BSc నర్సింగ్, ఫిజియోథెరపితో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://devnetjobsindia.org
News October 26, 2025
కైలాష్ సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని, తొడసం కైలాస్ మాస్టర్ రచించిన “సోభత ఖడి” సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, వనవాసి కల్యాణ పరిషత్ అధికారి శ్రీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


