News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల MLC అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించగ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Similar News
News January 16, 2026
జగ్గన్నతోట తీర్థంలో ప్రముఖుల సందడి

జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని శుక్రవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. మంత్రి వాసంశెట్టి సుభాశ్, ఎంపీ సానా సతీశ్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, బీజేపీ నేత మాధవ్ ఏకాదశ రుద్రులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివార్లకు పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వారి వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీతో తీర్థ ప్రాంతం జనసందోహంగా మారింది.
News January 16, 2026
మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో తరగతిలో ప్రవేశాలతో పాటు 7-10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. OC విద్యార్థులు రూ.200, మిగతావారు రూ.125 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మార్చి/ఏప్రిల్లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. April 19న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.
News January 16, 2026
ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలం: జూపల్లి

బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో చిన్న ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి విమర్శించారు. శుక్రవారం నిర్మల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోనే 18 వేల ఎకరాలకు సాగునీరు అందించే సదర్మాట్ భ్యారేజీ పూర్తి చేసిందన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న రైతుల నష్టపరిహారాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారన్నారు.


