News February 20, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పోస్టుల భర్తీ: జెడ్పీ సీఈవో

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని జెడ్పీ సీఈవో ఎస్ వివివి.లక్ష్మణరావు పేర్కొన్నారు. మండపేట మండల పరిషత్ కార్యాలయాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం సందర్శించారు.  రికార్డులు పరిశీలించి,ఉద్యోగుల పనితీరును ఎంపీడీవో కే సత్యనారాయణ మూర్తిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 19, 2025

ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

image

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.

News November 19, 2025

ఖమ్మం: యువ అభివృద్ధి పథకం.. దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ యువ కౌమార అభివృద్ధి పథకం ద్వారా గ్రాంట్-ఇన్-ఎయిడ్(జీఐఏ) కోసం ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సర్వీసుల అధికారి సునీల్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు, నాన్- గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు(NGO)ఈ పథకం కింద ఆర్థిక సాయం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జీఐఏ పోర్టల్ ద్వారా మాత్రమే అందిన దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.

News November 19, 2025

బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

image

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.