News February 20, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పోస్టుల భర్తీ: జెడ్పీ సీఈవో

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని జెడ్పీ సీఈవో ఎస్ వివివి.లక్ష్మణరావు పేర్కొన్నారు. మండపేట మండల పరిషత్ కార్యాలయాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం సందర్శించారు.  రికార్డులు పరిశీలించి,ఉద్యోగుల పనితీరును ఎంపీడీవో కే సత్యనారాయణ మూర్తిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 5, 2025

పండ్లు, కూరగాయలు తినే ముందు ఇది గుర్తుంచుకోండి

image

వ్యవసాయంలో అధిక దిగుబడి, చీడపీడల నివారణ కోసం ఈ మధ్యకాలంలో పంటలపై క్రిమిసంహారకాలు, కలుపు మందుల వాడకం ఎక్కువైంది. పంటకాలం పూర్తై, విక్రయించిన తర్వాత కూడా పురుగు మందుల అవశేషాలు పండ్లు, కూరగాయల నుంచి తొలగిపోవు. అందుకే మనం తినే ముందు వీటిని తప్పనిసరిగా శుభ్రం చేసి తినాలి. లేకుంటే ఈ అవశేషాలు ఎక్కువ కాలం శరీరంలోకి చేరితే క్యాన్సర్, గుండె జబ్బులు, అంగ వైకల్యం లాంటి సమస్యలు తలెత్తే ఛాన్సుంది.

News December 5, 2025

102 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 102 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్ మార్క్స్&జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఎగ్జామినర్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్&ట్రేడ్ మార్క్స్ కార్యాలయం, ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌లో 100 పోస్టులు, UPSCలో 2 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://upsc.gov.in

News December 5, 2025

ఈ నెల 8 నుంచి ANU యువజన ఉత్సవాలు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యువజన ఉత్సవాలను ఈ నెల 8, 9, 10 తేదీలలో జరుగుతాయని యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ మురళీమోహన్ తెలిపారు. 6వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ఉత్సవాలను విద్యార్థుల అభ్యర్థన మేరకు 8వ తేదీకి మార్చినట్లు తెలిపారు. మ్యూజిక్, డాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు ఉంటాయని చెప్పారు. వర్సిటీలోని కళాశాలలతో పాటు, అనుబంధ కళాశాల విద్యార్థులు పాల్గొనాలని కోరారు.