News February 20, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పోస్టుల భర్తీ: జెడ్పీ సీఈవో

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని జెడ్పీ సీఈవో ఎస్ వివివి.లక్ష్మణరావు పేర్కొన్నారు. మండపేట మండల పరిషత్ కార్యాలయాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం సందర్శించారు. రికార్డులు పరిశీలించి,ఉద్యోగుల పనితీరును ఎంపీడీవో కే సత్యనారాయణ మూర్తిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 14, 2025
జనగామ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలపై కలెక్టర్ రివ్యూ మీటింగ్

నిరుపేదలకు కనీస నివాస గృహం ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో వంద శాతం త్వరగా పూర్తి కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పెండింగ్ ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మీద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీవోలు, హోసింగ్ పీడీ, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ అధికారులతో గూగుల్ మీటింగ్ ద్వారా శుక్రవారం కలెక్టర్ రివ్యూ చేశారు.
News November 14, 2025
జూబ్లీ బైపోల్: ఆ నలుగురిలో NOTA!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో NOTA ప్రధాన పార్టీల సరసన నిలిచింది. 58 మంది అభ్యర్థులతో పాటు పోటీ చేసిన NOTA ఫలితాల్లో 4వ స్థానం దక్కించుకుంది. INC, BRS, BJP తర్వాత అత్యధికంగా ఏ గుర్తుకైనా ఓట్లు వచ్చాయంటే అది నోటాకే. None of the Above అంటూ 924 మంది ఓటర్లు బటన్ నొక్కారు. ఇతర పార్టీల అభ్యర్థులతో సహా ఏ ఇండిపెండెంట్ కూడా నోటా ఓట్లలో 25 శాతం అయినా దక్కించుకోలేదు.
News November 14, 2025
జూబ్లీహిల్స్లో పాటకే పరిమితమైన దేఖ్లేంగే!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ‘దేఖ్లేంగే’ అంటూ కార్యకర్తలను ఉర్రూతలూగించిన పాటలు ఓట్లు రాబట్టలేదు. బస్తీవాసులను పెద్దగా ప్రభావితం చేయలేదు. సైలెంట్ ఓటింగ్ తమకే సొంతం అనుకున్న BRSకు జూబ్లీ ప్రజలు ఝలక్ ఇచ్చారు. ప్రతి రౌండ్లో నవీన్ యాదవ్కు జై కొట్టారు. తొలి రౌండ్లో 47 ఓట్లతో మొదలైన లీడింగ్ 10వ రౌండ్లో 24,729 వేలకు చేరడం విశేషం. అడ్డదారిలో గెలిచారని మరో వైపు BRS నేతలు వాదిస్తున్నారు.


