News February 20, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నిషేధాజ్ఞలు జారీ: కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్ట్యా కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి బుధవారం పలు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. ఈ సమయంలో సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం, గుంపులుగా తిరగడం చేయరాదన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్ కు వంద మీటర్ల లోపు ఐదుగురు కంటే ఎక్కువ వ్యక్తులు గుమిగూడకూడదని హెచ్చరించారు.

Similar News

News November 21, 2025

బాపట్ల: ‘మత్స్యకారులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక’

image

మత్స్యకారులు, ఆక్వా ఫార్మర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ అన్నారు. నిజాంపట్నం సైక్లోన్ భవన్ వద్ద శుక్రవారం జరిగిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వేడుకల్లో డీఆర్ఓ పాల్గొన్నారు. గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు ప్రసాద్ అన్నారు.రాష్ట్ర అగ్నికుల క్షత్రియ ఛైర్మన్ పాపారావు పాల్గొన్నారు.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.