News February 20, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నిషేధాజ్ఞలు జారీ: కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్ట్యా కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి బుధవారం పలు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. ఈ సమయంలో సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం, గుంపులుగా తిరగడం చేయరాదన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్ కు వంద మీటర్ల లోపు ఐదుగురు కంటే ఎక్కువ వ్యక్తులు గుమిగూడకూడదని హెచ్చరించారు.

Similar News

News November 20, 2025

HYD: మార్చి 2026 నాటికి మెట్రో లైన్ క్లియర్

image

HYDలో సుమారు 162 కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఏ కారిడార్లు సాధ్యమో, విస్తరణ స్థాయి ఎంత వరకూ ఉండాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాలతో దశంలో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయనుందని మంత్రి HYDలో పేర్కొన్నారు.

News November 20, 2025

24 నుంచి కడప జిల్లాలో YS జగన్ పర్యటన.?

image

ఈనెల 24 నుంచి 3 రోజులపాటు కడప జిల్లాలో YS జగన్ పర్యటిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు జిల్లాలో పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సోమవారం, మంగళవారం, బుధవారం ఆయన పులివెందులతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని, జగన్ పర్యటన వివరాలు అధికారికంగా రావాల్సి ఉందని YCP నాయకులు పేర్కొన్నారు.

News November 20, 2025

HYD: DEC30 నుంచి వైకుంఠద్వార దర్శనం

image

TTD వైకుంఠ ద్వార దర్శనం 2025 కోసం DEC 30 నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు HYD అధికారి జయేష్ తెలిపారు. భక్తుల కోసం మొత్తం 164 గంటలకుపైగా దర్శన సమయం కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో కేవలం e-Dip టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుంది. ఈ టైమ్‌లో ఆఫ్‌లైన్ టోకెన్లు పూర్తిగా రద్దు చేశారు.