News February 8, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

image

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరిటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 18, 2025

సమష్టి సహకారంతో ఎన్నికలు విజయవంతం: ఎస్పీ

image

జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా పూర్తిగా శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రకటించారు. ప్రజల సహకారం, అధికారుల సమన్వయం, పోలీసు విభాగం కర్తవ్య నిష్ఠతో పని చేయడం ఈ ఎన్నికల విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. ఎన్నికల భద్రత కోసం అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, 950 మంది పని చేసినట్లు చెప్పారు.

News December 18, 2025

సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ఎత్తివేత

image

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయనున్నట్లు పేర్కొంది. ఎన్నికల విధుల్లో మరణించిన అధికారుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగగా NOV 25 నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది.

News December 18, 2025

2,93,587 పంపు సెట్లకు పగటి వేళే విద్యుత్: CS

image

AP: గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పూర్తయితే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గేందుకు వీలుకలుగుతుందని CS విజయానంద్ అభిప్రాయపడ్డారు. PM-KUSUM స్కీమ్ కింద వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ ద్వారా 2,93,587 అగ్రి పంపులకు పగలే 9 గంటలు విద్యుత్ అందించేలా పనులు కేటాయించామన్నారు. ‘స్కీమ్‌లో చేపట్టిన ప్రాజెక్టులతో 3 ఏళ్లలో ₹2,368 కోట్ల మేర పొదుపు అవుతుంది. తద్వారా టారిఫ్‌లూ తగ్గుతాయి’ అని కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు.