News February 8, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరిటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 25, 2025
స్వదేశీ MRI మెషీన్.. అక్టోబర్ నుంచి ట్రయల్స్

తొలి స్వదేశీ MRI మెషీన్ను భారత్ అభివృద్ధి చేసినట్లు ఎయిమ్స్ ఢిల్లీ తెలిపింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ కోసం ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో టెస్టుల ఖర్చులతో పాటు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశముందని వెల్లడించింది. ఈ మెషీన్ వైద్య సాంకేతికతలో భారత్ను స్వావలంబన దిశగా నడిపించడంలో సహాయపడనుంది.
News March 25, 2025
హనుమకొండ: కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ నగరంలోని పాత ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్లో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జీ ప్లస్ టు కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి స్థాయిలో పనుల పురోగతిని బ్లూ ప్రింట్ మాప్ ప్రకారం పరిశీలించారు.
News March 25, 2025
NTR: జిల్లాకు ఆరంజ్ అలర్ట్- APSDMA

ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) మంగళవారం హెచ్చరించింది. వడగాడ్పులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. చందర్లపాడు 41.5, జి.కొండూరు 41.3, ఇబ్రహీంపట్నం 42.2, కంచికచర్ల 41.4, విజయవాడ రూరల్ 40.5, విజయవాడ అర్బన్ 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవనున్నట్లు తెలిపారు.